S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ్లామర్ భామ అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి-2’, ‘సింగం-3’ చిత్రాల్లో నటిస్తోంది. దానితోపాటు భాగమతి అనే చిత్రం కూడా చేస్తోంది. ప్రస్తుతం అనుష్క సన్యాసినిగా ఓ సినిమా కోసం మారనున్నదట. నాగార్జున కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో అనుష్క సన్యాసినిగా నటించనుందని సమాచారం. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వున్నారు.
ప్రిన్స్, వ్యోమానంది జంటగా శ్రీ చైత్రా చలనచిత్ర పతాకంపై వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ- ఓ విభిన్నమైన ప్రేమకథతో వైవిధ్యమైన మనస్తత్వాలు వున్న అమ్మాయి, అబ్బాయిమధ్య సాగే యుద్ధంగా ఈ ప్రేమకథ సాగుతుందని తెలిపారు.
‘రెండక్షరాలు’ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, రెండు జంటలమీద సాగే ఈ చిత్రం సందేశాత్మకంగా వుంటుందని నిర్మాత పైలా దేవదాస్రెడ్డి తెలిపారు. శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం. దర్శకత్వంలో ఆయన రూపొందించిన రెండక్షరాలు గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్. మైండ్ గేమ్తో సాగే ఈ సినిమాలో చరణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఇందులో హీరోయిన్గా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది.
తెలుగు చిత్రసీమలో మహానటులున్నా వారికి పద్మశ్రీవంటి పురస్కారాలు రాకపోవడం తెలుగువారి దౌర్భాగ్యమని, ప్రతిభను గుర్తించని ప్రభుత్వాలు రికమెండేషన్లను గుర్తించి ముక్కూముఖం తెలియనివారికి ఆ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాయని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలవల్ల ఆ పురస్కారం చిన్నబోతోందని అన్నారు.
నాని, సురభి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెంటిల్మన్’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
కథ నచ్చింది
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ టైటిల్ను నిర్ణయించారు. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథీరామ్బాబా జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని మహేష్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్లు ఎంపికయ్యారు.
బాలీవుడ్ హాట్ భామ దీపికాపదుకొనేకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గ్లామర్తోపాటు నటనలో కూడా మంచి సత్తావున్న హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు కమర్షియల్ యాడ్స్ విషయంలోనూ అంతే డిమాండ్ ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ యాడ్కోసం దీపిక తీసుకునే రెమ్యునరేషన్ విని షాకయ్యారట వాళ్లు.
రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాల గురించి నిర్మాతలు తెలియజేశారు.‘మొదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 14నుండి 30వరకు వైజాగ్లో రెండో షెడ్యూల్ను జరపనున్నాం. రామ్, సంతోష్ శ్రీనివాస్ల కాంబినేషన్లో వచ్చిన ‘కందిరీగ’ చిత్రం సంచలన విజయం సాధించింది.
‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి తన కెరీర్కి సరైన సక్సెస్ను ఇవ్వలేకపోయాయి. దాంతోపాటు హిందీలో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత మరో చిత్రంతో ముందుకు రానున్నాడు.