S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం
విశాఖపట్నం, మార్చి 26: విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు మరింతగా ఎయిర్ కనెక్టివిటీ అవసరమని విశాఖ ఎంపి కె.హరిబాబు అన్నారు. విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలన్నారు. సరకు రవాణా రంగంపై కూడా విమానయాన సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు.
విశాఖపట్నం, మార్చి 26:రాజకీయాల్లో నిబద్దతకు మారుపేరైన పూసపాటి ఆనంద గజపతి రాజు మృతి తీరని లోటని పలువురు నాయకులు అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచిన ఆనంద్ మృతి పట్ల పలువురు నాయకులు తమ తీవ్ర దిగ్భ్రాంతి, వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విశాఖపట్నం, మార్చి 26: దేవాదాయ శాఖకు సంబంధించి ఆక్రమణకు గురైన విలువైన భూముల స్వాధీనానికి దేవాదాయ శాఖ ఉపక్రమించింది. దీనిలో భాగంగా నగరంలోని అల్లిపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన టౌన్ సర్వే నెంబర్ 1450లోగల 600 చదరపుగజాల భూమిని చాలాకాలంగా ఆక్రమణదార్ల కబంధహస్తాల్లో చిక్కుకుంది.
విశాఖపట్నం, మార్చి 26: ఉచిత ఇసుక విధానంలో భాగంగా జిల్లాలో గుర్తించిన రీచ్లకు టెక్నికల్ అసిస్టెంట్లను నియమిస్తూ సంయుక్త కలెక్టర్ జె నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇసుక రీలకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లను ఇన్ఛార్జ్లుగా నియమించిన ప్రభుత్వం వీరికి సహాయకులుగా ఉండేందుకు టెక్నికల్ సహాయకులను నియమించినట్టు జెసి నివాస్ తెలిపారు.
విశాఖపట్నం, మార్చి 25: నగరంలో అఖిల భారత గిరిజన నృత్యోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ వెల్లడించారు. ఈ నెల 29 నుంచి 31 వరకు ఆర్కే బీచ్రోడ్డులో ఉత్సవాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విశాఖపట్నం, మార్చి 25: నగరంలోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో గుడ్ఫ్రైడేను జరుపుకున్నారు. శుక్రవారం నగరంలోని జ్ఞానాపురం రక్షణ గిరిపై ఉదయం ఆరు గంటలకే విశాఖ ఆర్చ్ బిషప్ ఎం.ప్రకాశ్ శిలువను మోసుకుంటూ 14 స్థలాలను సందర్శించి తిరిగి గిరికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు.
విశాఖపట్నం, మార్చి 25: రాష్ట్రంలో పేరేన్నికగన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవికి అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు శ్రీ వేంకటేశ్వర, ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వైస్ ఛాన్సలర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇన్ఛార్జి పాలనలోనే కొనసాగుతొంది.
విశాఖపట్నం, మార్చి 25: దేశ ద్రోహులకు మద్దతిస్తున్న కాంగ్రెస్, వామపక్షాల తీరుకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆక్రోశ యాత్రను నిర్వహించారు. నగర బిజెపి అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్, వామపక్షాల శవ యాత్రను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ యాత్రలో పాల్గొని కాంగ్రెస్, వామపక్షాల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
విశాఖపట్నం, మార్చి 25: స్మార్ట్సిటీగా రూపాంతం చెందుతున్న విశాఖ నగరంలో ఇక స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నేరాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నగర పోలీసు విభాగం ముందుకు సాగనుంది. నేరాల నియంత్రణలో కీలకమైన అంశాలను క్రోఢీకరించడంతో పాటు నేర నియంత్రణలో ముందస్తు చర్యలకు నిఘా కెమేరాలను వినియోగించనుంది.
విశాఖపట్నం, (కల్చరల్) మార్చి 22: ప్రపంచ జల వనరుల దినోత్సవం సందర్భంగా గీతం విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్ధులు సభ్యులుగా గల ఇంజనీర్స్ వితపుట్బోర్డర్లు (ఇండియ) విద్యార్ది విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్తానిక ఆర్కెబీచ్ నుంచి వైఎంసిఏ వరకు భారీ నగర ప్రదర్శనకు నిర్వహించారు.