S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/30/2018 - 05:57

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనను ఇంత జటిలం ఎందుకు చేశారని, ఇదేమి అస్తు ల విభజన కాదు, అడ్వకేట్ జనరల్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు కదా? అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థ లు, డిస్కమ్‌లు ఉద్యోగుల విభజనపై ఉమ్మడి హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ విద్యు త్ కంపెనీలు ఆశ్రయించాయి.

08/31/2018 - 05:07

న్యూఢిల్లీ, ఆగస్టు 29: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయడానికి సిద్ధమా? అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రాన్ని సవాల్ చేశారు. రాఫెల్‌పై కాంగ్రెస్ ఆరోపణలన్నీ తప్పుల తడక అంటూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ తిప్పికొట్టారు.

08/30/2018 - 02:01

న్యూఢిల్లీ, ఆగస్టు 29: తెలుగు రాష్ట్రాల్లోని న్యాయాధికారుల విభజన వివాదంపై సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని న్యాయాధికారుల విభజనపై దాఖలైన పిటిషన్లపై వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తులు ఏ.కే సిక్రీ, ఆశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

08/30/2018 - 05:15

న్యూఢిల్లీ, ఆగస్టు 29: డిజిటల్ సొల్యూషన్స్‌పై విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జావడేకర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. దీని కోసం ‘స్మార్ట్ హేకథాన్’ థర్డ్ ఎడిషన్‌ను మంత్రి ప్రకటించారు. ఇంతకు ముందు రెండు ఎడిషన్లు విజయవంతంగా నిర్వహించామన్న మంత్రి మూడోది సెప్టెంబర్‌లో ఉంటుందని తెలిపారు.

08/30/2018 - 05:23

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న కురుబ, ధనగర్ తదితర గొర్రెల కాపర్ల రాజకీయ, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందిస్తోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గొర్రెలు, మేకల అభివృద్ధికి జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని గడ్కరీ తెలిపారు.

08/29/2018 - 23:35

భువనేశ్వర్, ఆగస్టు 29: ఒడిశాలోని మహానది నీటిమట్టం పెరిగి కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఒడిశా ప్రభుత్వం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. ఒడిఆర్‌ఏఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఫైర్ సర్వీసుకు చెందిన వారిని పూరి, జగత్‌సింగ్‌పూర్, కటక్, భద్రాక్ ప్రాంతాలకు పంపినట్టు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ బిపి సేథి తెలిపారు.

08/29/2018 - 23:33

న్యూఢిల్లీ, ఆగస్టు 29: సరైన వైద్యం అందించకుండా రోగి మరణానికి కారణమైన నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి ఢిల్లీ వినియోగదారుల ఫోరం 25 లక్షల రూపాయలు జరిమానా విధించింది. రోగి కుటుంబ సభ్యులకు 24 లక్షల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చులకు మరో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి ఫోరం ఆదేశించింది.‘ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి మానవతాదృక్పధంతో వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత వైద్యులకుంది.

08/29/2018 - 23:29

లాహోర్, ఆగస్టు 29: సింధూ నదీ జలాల ఒప్పందం, దానికి సంబంధించిన వివిధ సమస్యలపై పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య బుధవారం చర్చలు ప్రారంభమయ్యాయి. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో మొదటి రౌండ్ చర్చలు పాక్‌లోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో జరిగాయి.

08/29/2018 - 16:43

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంతేకాదు పెన్షనర్లకు అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం బేసిక్ పేలో ఉన్న ఏడు శాతం కాకుండా అదనంగా రెండు శాతం డీఆర్ ఇవ్వనున్నారు.

08/29/2018 - 13:52

జమ్ముకాశ్మీర్‌: అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.

Pages