S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/11/2018 - 01:53

న్యూఢిల్లీ, జూన్ 10: భారతీయ జనతా పార్టీ అతర్గతంగా రహస్య సర్వే చేసిందంటూ, నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచురించారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. ఢిల్లీలో జీవీఎల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘దైనిక్ భాస్కర్’ మిడియా పోర్టల్ అందించిన తప్పుడు సమాచారాన్ని నిజమని భ్రమించి తెలుగు పత్రికలు కూడా ప్రచురించాయని వెల్లడించారు.

06/11/2018 - 01:52

ముంబయి, జూన్ 10: ముంబయి- హౌరా మెయిల్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.వీటిల్లో ప్యాన్‌ట్రీ కారుకూడా ఉన్నది. మహారాష్టల్రోని లగత్‌పురి వద్ద ఆదివారం తెల్లవారుజామున 2.05 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదంలో ఎవరూ మరణించడం లేదా గాయపడటం సంభవించలేదు. ఉదయం 7 గంటలకల్లా పట్టాలు తప్పిన మూడు కోచ్‌లను రైల్వే లైనుపైకి చేర్చారు.

06/11/2018 - 01:51

న్యూఢిల్లీ, జూన్ 10: అమర్‌నాథ్ యాత్రికులకు భద్రత నిమిత్తం 22,500 మంది అదనపు పారామిలిటరీ బలగాలు కావాలని జమ్ము-కశ్మీర్ పోలీసులు కోరారు. అమర్‌నాథ్ యాత్ర కొనసాగే దారి పొడవునా బహుళ అంచలతో కూడిన భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 28న ప్రారంభమవుతుంది. పరమశివుడు మంచు లింగాకృతిలో వెలిసే అమరనాథ్ గుహ దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్నది.

06/11/2018 - 01:50

న్యూఢిల్లీ, జూన్ 10: బీమా-కొరేగావ్ ఘటన వెనుక దళిత నక్సల్స్ ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని బీజేపీ ఎంపీ, దళిత నాయకుడు ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టి లబ్ది పొందే ఉద్దేశంతో కొంతమంది చేస్తోన్న కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు.

06/11/2018 - 01:50

జమ్ము, జూన్ 10: భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు తీసుకోబోమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇక కేంద్ర సంయుక్త కార్యదర్శుల నియామకాలపై ఆయన స్పందిస్తూ, అందుబాటులో ఉన్న అన్ని వనరులనుంచి మరింత ప్రతిభావంతులకు అవకాశం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. రోహింగ్యాలకు అక్రమంగా ఆధార్ లేదా ఓటింగ్ కార్డులు అందించిన అధికార్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

06/11/2018 - 01:34

న్యూఢిల్లీ, జూన్ 10: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా మాజీ ఎన్‌ఐఏ అధిపతి శరద్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. 62 ఏళ్ల కుమార్, 1979 బ్యాచ్ ఐపీఎస్ కేడర్‌కు చెందినవారు. ఎన్‌ఐఏ అధినేతగా గత సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేశారు. కాగా ఆయన సీవీసీగా మరో నాలుగేళ్లు కొనసాగుతారు. గత ఫిబ్రవరి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది.

06/11/2018 - 01:33

న్యూఢిల్లీ, జూన్ 10: దేశ రాజధాని ఢిల్లీలో సత్యదేవని కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. గోల్ మార్కెట్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధ్యాన మందిరంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో సత్యదేవుని కల్యాణం అశేష భక్తజన వాహిన మధ్య కనులవిందుగా జరిగింది. శనివారం ఇదే ప్రాగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించారు.

06/11/2018 - 00:30

శ్రీనగర్, జూన్ 10: పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయ. సరిహద్దులు దాటేందుకు ముష్క రులు ప్రయత్నిస్తూ భద్రతా బలగాల కంట పడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నా య. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సరిహద్దును దాటేందుకు

06/11/2018 - 00:22

న్యూఢిల్లీ/ హైదరాబాద్/ పట్నా, జూన్ 8: జేఈఈ ఫలితాలను ఆదివారం కాన్పూర్ ఐఐటీ ప్రకటించింది. మొత్తం 360 మార్కులకు 350 మార్కులు సాధించిన పంచకుల విద్యార్థి ప్రణవ్ గోయల్ ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకును సాహిల్ జైన్, మూడో ర్యాంకును కైలాష్ గుప్తాలు సాధించారు. బాలికల్లో 318 మార్కులతో మీనాల్ పరేఖ్ అగ్రస్థానంలో నిలిచారు.

06/11/2018 - 03:26

న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగావున్న 10 జూయింట్ సెక్రటరీ పోస్టుల భర్తీకి మోదీ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. ‘లేటరల్ ఎంట్రీ’ పథకం కింద వీరిని ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అభ్యర్థికి తప్పనిసరిగా జూలై 1నాటికి 40 ఏళ్ల వయసుండాలి. గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. వీరిని ప్రభుత్వ సర్వీసులో మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తారు. తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశముంది.

Pages