-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ: భారత్లో ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టడం అభినందనీయమని యునిసెఫ్ భారత ప్రతినిధి యాస్మిన్ అలీహక్ ప్రశంసించారు. గత వారంలో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ బులెటిన్ (ఎస్ఎల్బీ) ప్రకారం 2013తో పోలిస్తే ఈ మరణాలు 22% తగ్గాయన్నారు. ప్రతి లక్ష ప్రసవాలలో 2011-13లో 167 మాతృ మరణాలు ఉండగా, 2014-16కు 130కు చేరుకున్నాయని చెప్పారు.
న్యూఢిల్లీ/లక్నో, జూన్ 9: రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, యూపీ, మహారాష్టల్ల్రో దుమ్ము తుపాను, భారీ వర్షం అతలాకుతలం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా 28 మంది మృతి చెందారు. యూపీలో పిడుగులు పడి 26 మంది మృతి చెందారు. శువ్రారం రాత్రి 11 జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మహారాష్టల్రో ఇద్దరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది.
చిత్రం: ఢిల్లీలో అకస్మాత్తుగా నల్లని మబ్బులు కమ్ముకోవడంతో పరుగులు తీస్తున్న జనం. విజయ్ చౌక్లో శనివారం నాటి దృశ్యమిది.
దుమ్ము ధూళి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రాజధాని కాస్తంత చల్లబడింది.
న్యూఢిల్లీ, జూన్ 9: బీజేపీ లోక్సభ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలవటం తెలిసిందే. గత ఎన్నికల్లో విజయం సాధించిన 282 లోక్సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీల విజయావకాశాలపై ఒక ప్రముఖ సంస్థతో బీజేపీ సర్వే చేయించింది.
కింగ్డావో: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చైనాలోని కింగ్డావోకు చేరుకున్నారు. 18వ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం, రష్యాపై అమెరికా ఆంక్షలు, వాణిజ్యం, ఉగ్రవాదం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృత చర్చలు జరపనున్నారు.
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం లక్నోలో భేటీ అయ్యారు. శనివారం లక్నోలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి సంజయ్ దత్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. అనంతరం ఎన్డీఏ సర్కార్ నెరవేర్చిన హామీలు, చేరుకున్న లక్ష్యాలు, పలు పథకాలకు సంబంధించిన బుక్లెట్ను సంజయ్కు యోగీ అందజేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, రాజేష్ భారతి క్రిమినల్ గ్యాంగుకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ ఢిల్లీ చత్రపూర్ ఏరియాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో నలుగురు దుండగులు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముఠా నాయకుడిగా పేరున్న రాజేష్ భారతి ఉన్నారు.
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 32 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 3 విమానాలను రద్దు చేశారు. అటు లోకల్ రైళ్లు 10-15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ అధికారులను అప్రమత్తం చేశారు.
పనాజీ: గోవా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శాంతారామ్ నాయక్ శనివారం హఠాన్మరణం చెందారు. మార్గావోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 72 ఏళ్ల శాంతారామ్ నాయక్... గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు గోవా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిమ కౌటిన్హో వెల్లడించారు.
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి ఎల్.పి షాహి కన్నుమూశారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ లలితేశ్వర్ ప్రసాద్ షాహి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బీహార్కు చెందిన షాహి 1980లో శాసనసభ్యుడిగా అడుగు పెట్టారు. 1984లో ముజఫర్పూర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు.