-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శనివారం తెల్లవారుజామున 4.30గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఫోర్ట్ ప్రాంతంలోని పటేల్ ఛాంబర్స్లో భవనం నుంచి మంటలు ఎగిసిపడుతుంటడంతో ప్రమాదం ధాటికి భవనంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
చెన్నై: చైనా-పాక్ మధ్య ఏర్పడుతున్న బంధం నేపథ్యంలో భారత్దేశం చైనా పట్ల తన వైఖరిపై ఎలాంటి సమీక్ష జరపదని దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) కింద ఇరుదేశాలు పలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో చైనాతో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని, భారత్ దీనిపై ఎలాంటి సమీక్ష నిర్వహించదని అన్నారు.
బెంగళూరు, జూన్ 8: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసులో ఫోరెన్సిక్ లేబొరెటరీ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. గౌరీ లంకేష్, హైతువాద నాయకుడు ఎంఎం కల్బుర్గి ఒకే తుపాకీకి బలయ్యారు. ఇద్దరిపై కాల్పులకు వాడింది ఒకే తుపాకీ అని ఫోరెన్సిక్ లెబొరెటరీ నిర్ధారించింది. దీన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి.
పుణె, జూన్ 8: మానవబాంబుతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అంతమొందించినట్టే ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు సీపీఐ మావోయిస్ట్ దళిత్ పన్నిన కుట్ర బహిర్గతమైంది. బహిరంగ సభలోగాని, రాజకీయ రోడ్ షోలోగాని ఆత్మాహుతి దాడితో ప్రధానిని హత్యకావించేందుకు మావోయిస్టులు కుట్ర పన్నినట్టు ధ్రువీకరించే లేఖను శుక్రవారం పుణె పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 8: చిన్న ఫోన్కాల్.. ఒక ఈ-మెయిల్.. ఒక కొరియర్ పంపిస్తే చాలు కోటి రూపాయలు చేతిలో వచ్చి వాలుతాయి. ఇంకేం జనం పక్కవాడి గురించి తమకు తెలిసిన సమాచారం అందించి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల గృహ సముదాయంలో శుక్రవారం కలకలం రేగింది. ఈ సముదాయంలోని ఓ క్వార్టర్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో పని చేసేవారని తెలిపారు. మృతదేహం ఉన్న గదికి లోపలి నుంచి తాళం వేసి ఉన్నట్లు తెలిపారు. ఆయన కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ముంబయి: రుతుపవనాల ప్రభావం వల్ల దేశ ఆర్థికరాజధాని అయిన ముంబయినగరంలో వచ్చే నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జూన్ 6 నుంచి 12వతేదీ వరకు భారీ వర్షాలు కురవవచ్చని స్కైమెట్ వాతావరణ సంస్థ వ్యవస్థాపకుడు జతిన్ సింగ్ ట్వీట్ చేశారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఏసీ వ్యవస్థ నిలిచిపోవడంతో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న నలుగురు పేషెంట్లు మృతిచెందారు. కొందరు పేషెంట్లను ఇతర హాస్పటళ్లకు తరలించారు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. హాస్పటల్లో రెండు ఏసీ యూనిట్లు ఉన్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 7: డబ్బుకోసం ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను బెదిరించినట్టు రుజువు కావడంతో గ్యాంగ్స్టర్ అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించింది. 2002లో ఐదుకోట్ల రూపాయలు ఇవ్వాలని సలేం బెదిరించాడు. ఈ కేసులో అతడిని కోర్టు గత నెల 26న దోషిగా తేల్చింది. గురువారం అడిషనల్ సెషన్స్ జడ్జి తరుణ్ షేరావత్ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతతోపాటు మహారాష్ట్ర, బిహార్, హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్కు చెందిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, వరద నివారణ పథకాలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది.