-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
విశాఖపట్నం, నవంబర్ 19: రానున్న రోజుల్లో రైలు పెట్టెల రంగులు మారునున్నాయి. రైళ్ళ నిర్వహణలో కొత్తదనం ఉట్టిపడేలా, ప్రయాణికులను విశేషంగా ఆకర్షించే విధంగా రైలు పెట్టెల రంగులను సమూలంగా మార్పు చేయాలని రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దేశంలో ఉండే రైల్వేజోన్లు, డివిజన్లకు పంపినట్టు తెలిసింది. రైలు పెట్టెలకు కొత్త రంగు అద్దడం కోసం గత కొంతకాలంగా పెట్టెల తయారీ సైతం నిలిచిపోయింది.
రాజోలు, నవంబర్ 19: నక్సల్స్ అణచివేతలో భాగంగా ఛత్తీష్గఢ్ సుకుమా జిల్లాలో కూంబింగ్ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కోళ్ల వెంకన్న (43) ఆదివారం తెల్లవారుఝామున నక్సల్స్ ఏర్పాటుచేసిన మందుపాతర పేలడంతో మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన వెంకన్న సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్లో హెచ్సీగా విధులు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 19: కాశ్మీర్లో ఉగ్రవాదమే పనిగా పెట్టుకున్న స్థానిక మిలిటెంట్లపై ఇటు సైన్యం, అటు స్థానిక పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మీరు ముజాహిద్దీన్లా? లేక పాకిస్తాన్ తరఫున రాష్ట్రంలో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా చేస్తున్నారా?’ అంటూ వీరిపై నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చివరి శ్వాస వరకూ లౌకికవాద పరిరక్షణ కోసమే పాటుపడ్డారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. భారతీయులందరూ ఒక్కటేనన్నదే ఆమె మతం, అభిమతమని సోనియా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు భారీస్థాయిలో పెరిగినట్టు యూరప్కు చెందిన వరల్డ్లైన్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలువల్ల దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ చెల్లింపులతో కూడిన లావాదేవీలు పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది.
మన్నార్గుడి, నవంబర్ 19: దాదాపు 20ఏళ్లపాటు జయలలితకు చేదోడువాదోడుగా ఉండి అన్ని విధాలుగా ఆమెకు సహరించిన శశికళకు రక్షణ లేకుండా పోయిందని ఆమె సోదరుడు వి దివాకరన్ ఆవేదన వ్యక్తం చేశారు. శశికళ ఇళ్లపై ఆదాయం పన్ను దాడులు జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన ఆయన ‘నా సోదరికి జయలలిత ఏరకంగానూ రక్షణ కల్పించకుండా వెళ్లిపోయారు’ అని అన్నారు. 1996 నుంచీ శశికళపై ఏదో ఒక రకమైన దర్యాప్తు జరుగుతూనే ఉందన్నారు.
అహ్మదాబాద్, నవంబర్ 19: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు కాంగ్రెస్ తొలిజాబితా విడుదలైంది. ఇప్పటికే బిజెపి వందకు పైగా తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పార్టీ కుమ్ములాటలు, మిత్రపక్షాల సీట్ల డిమాండ్ల మధ్య ఆదివారం పొద్దుపోయాక కాంగ్రెస్ తన తొలి జాబితాను 71 మంది అభ్యర్థులతో విడుదల చేసింది.
ఇటానగర్, నవంబర్ 19: ఈశాన్య భారతం దేశానికి కిరీటం లాంటిదయితే అరుణాచల్ ప్రదేశ్ దానికి పొదిగిన వజ్రం లాంటిదని రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ అభివర్ణించారు. నాలుగు రోజులపాటు ఈశాన్య భారత పర్యటనకు వచ్చిన రాష్టప్రతి వివేకానంద కేంద్ర 40వ వార్షికోత్సవంలో ఆదివారం ముగింపు ఉపన్యాసం ఇచ్చారు.
జైపూర్, నవంబర్ 19: ‘పద్మావతి’ సినిమా వాయిదా నిర్ణయం ప్రజల్ని మోసగించే ప్రయత్నమేనని రాజ్పుత్ కర్ణిసేన నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి స్పష్టంచేశారు. ఈ సినిమా నిర్మాణానికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి రహస్యంగా నిధులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్నందుకు తనకు కరాచీనుంచి బెదిరింపు ఫోన్లు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు.
ముంబయి, నవంబర్ 18: సెన్సార్ ధ్రువీకరణ పత్రం లేకుండానే ‘పద్మావతి’ సినిమాను కొన్ని జాతీయ టీవీ చానళ్లలో ఎలా ప్రసారం చేస్తారని ‘సెంట్రల్ బోర్టు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్’ (సీబీఎఫ్సీ) చైర్మన్ ప్రసూన్ జోషీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.