S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2017 - 01:45

దేశవ్యాప్తంగా రాఖీపున్నమిని ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి
రాఖీలు కడుతున్న చిన్నారులు.

08/08/2017 - 01:43

దేశవ్యాప్తంగా రాఖీపున్నమిని ఘనంగా జరుపుకున్నారు. రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాఖీ కట్టేందుకు వచ్చిన చిన్నారులను ఎత్తుకున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్.జబల్‌పూర్ సెంట్రల్ జైలు వద్ద ఖైదీలకు రాఖీలు కట్టేందుకు బారులుతీరిన మహిళలు

08/08/2017 - 00:47

శ్రీనగర్, ఆగస్టు 7: జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ నుంచి భారీ చొరబాటు యత్నాన్ని భద్రతాదళాలు తిప్పికొట్టాయి. మాచిల్ సెక్టార్‌లో సోమవారం పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు వాస్తవాధీనరేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. ముందుగా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రితో చొరబడటానికి ప్రయత్నించారు. వాస్తవాధీన రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతాబలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

08/08/2017 - 00:34

న్యూఢిల్లీ, ఆగస్టు 7: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంకల్పపర్వంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా నూతన భారత్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో పౌరులం తా గట్టిగా సంకల్పించుకోవాలని, ప్రజలంతా సరికొత్త ఆలోచనలను పంచుకోవాలని కేంద్రం సూచించింది.

08/07/2017 - 23:41

లక్నో, ఆగస్టు 7: సమాజ్‌వాది పార్టీలో కొనసాగటం ఇష్టం లేనివాళ్లు నిరభ్యంతరంగా పార్టీ వదిలి వెళ్లిపోవచ్చని ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి సంజాయిషీలు కూడా ఇవ్వకుండా వెళ్లిపోవచ్చని ఆయన అన్నారు. ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన నేపథ్యంలో ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

08/07/2017 - 23:40

అగర్తలా, ఆగస్టు 7: పేద గృహిణులకు ఇచ్చే వంటగ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం స్పష్టం చేశారు. ‘ఇంటికోసం వాడే ఎల్పీజీపై సబ్సిడీని తొలగించాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలు, సామాన్య ప్రజలకు సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రధాన్ విలేఖరులతో అన్నారు.

08/07/2017 - 03:16

తిరువనంతపురం, ఆగస్టు 6: కేరళలో రాజకీయ హింసాకాండకు అధికార సిపిఎం పార్టీయే కారణమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను నిర్మూలించేందుకు సిపిఎం తన కార్యకర్తలను వినియోగించుకుంటోందని ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ సంతాపసభలో జైట్లీ అన్నారు.

08/07/2017 - 03:15

గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. ఆదివారంనాడు సిరిగురి సమీపంలోని సుక్నా ప్రాంతంలో ఇలా మానవ హారాన్ని రూపొందించారు.

08/07/2017 - 03:13

న్యూఢిల్లీ/బెర్న్, ఆగస్టు 6: స్విస్ ఖాతాల్లో ఉన్న సమాచారాన్ని అందుకునేందుకు మార్గం సుగమమైంది. భారత్‌తో సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. భారత్‌లో డాటా సెక్యూరిటీ, రహస్య సమాచార చట్టాలు ఆ దేశంతో సమాచార మార్పిడి ఒప్పందం చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నాయని స్విట్జర్లాండ్ పేర్కొంది.

08/07/2017 - 03:12

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆధార్ నమోదు సత్ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఇప్పటివరకు సంక్షేమ పథకాల అమలులో మాత్రమే ఆధార్ ఉపయోగపడుతోందని అందరం భావిస్తున్నాం. అయతే ఈ ఫలితాల్లో మరో కొత్తకోణం వెలుగుచూసింది. అదేమిటంటే... ఆధార్ నమోదు చేసుకున్న దివ్యాంగులైన ముగ్గురు యువకులు రెండేళ్ల తర్వాత వారి కుటుంబాలను చేరుకోగలిగారు.

Pages