S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2017 - 01:31

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కొన్ని రకాల ట్రాక్టర్ విడిభాగాలపై పన్ను రేటును 28 శాతంనుంచి 18 శాతానికి గత్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ శనివారం నిర్ణయం తీసుకుంది. అలాగే టెక్స్‌టైల్‌కు సంబంధించిన అన్ని రకాల జాబ్ వర్క్‌లపై పన్నును కూడా 18 శాతంనుంచి 5 శాతానికి తగ్గించింది. అదే విధంగా 20 అంగుళాల దాకాస్క్రీన్ ఉండే కంప్యూటర్ మానిటర్లపై పన్నును సైతం 18శాతంనుంచి 12 శాతానికి తగ్గించింది.

08/06/2017 - 01:31

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఉగ్రవాదం, మత వైషమ్యాలు వంటి అనేక సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘సంవాద’ రెండో ఎడిషన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.‘ 21వ శతాబ్దంలో ప్రపంచం అనేక ఆటుపోట్లకు గురైంది. అనేక పెను సవాళ్లనే ఎదుర్కొంది.

08/06/2017 - 01:30

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశ 15వ ఉప రాష్టప్రతిగా తెలుగు తేజం వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. అందరూ ఊహించినట్టే బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం భారీ మెజారిటీతో ఉప రాష్టప్రతి పదవికి ఎన్నికయ్యారు. గాంధీ మనుమడు, విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

08/06/2017 - 02:39

చెన్నై: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసుకు సంబంధించి కార్తికి సిబిఐ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పదిరోజుల కిందటే కార్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

08/05/2017 - 03:32

వాషింగ్టన్, ఆగస్టు 4: భారతదేశంలో బిజెపికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్వర్ణయుగానే్న అందించారని భారత్-అమెరికా మేధావులు పేర్కొన్నారు. ముఖ్యంగా బిహార్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూప్రసాద్ యాదవ్‌తో నితీష్‌కుమార్ తెగతెంపులు చేసుకోవడంతో బిహార్‌లో అధికారాన్ని పంచుకునే అవకాశం బిజెపికి దక్కిందన్నారు.

08/05/2017 - 03:31

ధనేరా, ఆగస్టు 4: గుజరాత్‌లోని ధనేరాలో వరద ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రాహుల్ గాంధీకి ఎటువంటి గాయాలు కాలేదు కానీ ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి.

08/05/2017 - 03:31

న్యూఢిల్లీ, ఆగస్టు 4: విదేశాంగ విధానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సందర్భంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చింది.

08/05/2017 - 03:30

ఖాండ్వా(ఎంపి), ఆగస్టు 4: గాతారహే మేరాదిల్ అంటూ వందలాది పాటలతో భారతీయ జన హృదిని అలరించిన ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ 88వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఆయన జన్మస్థలపై ఖాండ్వా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, చిత్ర నిర్మాతగా కూడా రాణించిన కిశోర్ కుమార్ 1929 ఆగస్టు 4న ఇక్కడ జన్మించారు.

08/05/2017 - 03:30

న్యూఢిల్లీ, ఆగస్టు 4: రైల్వే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం రాజ్యసభలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్ గొహైన్ దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ నంబర్‌ను ఉపయోగించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి తెలిపారు. ‘రైల్వే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ నెంబర్ ఉండాలన్న ప్రతిపాదన ప్రస్తుతానికి లేదు.

08/05/2017 - 03:07

న్యూఢిల్లీ, ఆగస్టు 4: మరణాలను నమోదు చేసేందుకు అక్టోబర్ 1నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను సమర్పించాలని కేంద్రం ప్రకటించింది. గుర్తింపులో మోసాలను నిరోధించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. జమ్మూ- కాశ్మీరు, అసోం, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని, ఈ మూడు రాష్ట్రాలకు మరో తేదీని విడిగా ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది.

Pages