S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/01/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 31: గుజరాత్‌లో 2002నాటి గోధ్రా అనంతర అల్లర్ల కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ఏ చర్య అయినా తీవ్రమైన నేరమేనని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ తన పాత సహచరుడు రైస్ ఖాన్ పఠాన్‌పై విచారణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

08/01/2017 - 02:03

న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో ఆవాల సాగుపై జన్యుపరంగా కొన్ని మార్పులు తీసుకొస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దీనిపై నెలన్నర రోజుల్లో ఓ విధాన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య పంటలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

08/01/2017 - 02:03

కోల్‌కతా, జూలై 31: పశ్చిమ బెంగాల్ నుంచి అయిదుగురు తృణమూల్ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఎం అభ్యర్థి బికాస్ రంజన్ భట్టాచార్య నామినేషన్ సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో రద్దుకావటంతో మిగిలిన ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

08/01/2017 - 02:03

న్యూఢిల్లీ, జూలై 31: ప్రభుత్వం కల్పించే వసతిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఎంపీలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు తీరా ఖాళీచేయాల్సి వచ్చినప్పుడు వ్యతిరేకించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అలాంటి వారిని సాధ్యమైనంత త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, గడవు లోపల ఖాళీ చేయించేందుకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

08/01/2017 - 02:02

న్యూఢిల్లీ, జూలై 31: జీఎస్టీ ఫలాలను అందరూ పొందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపికి చెందిన ఎంపీలతో సోమవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ, జీఎస్టీతో అందరూ లబ్ధి పొందేందుకు నిరంతరం కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు జీఎస్టీలో నమోదయ్యేలా చూడాలని పేర్కొన్నారు. జీఎస్టీపై చిరు వ్యాపారులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.

08/01/2017 - 02:01

గువాహతి, జూలై 31: వరదలతో అతలాకుతలమైన అసోంను మంగళవారం ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా రెండు సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు అస్సాం రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ తెలిపారు. తరచూ వరదలు అసోంను ముంచెత్తుతుండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు రాష్ట్ర మంత్రి మండలి, అధికారులతో ప్రధాని చర్చలు జరుపనున్నట్లు చెప్పారు.

08/01/2017 - 02:01

శ్రీనగర్, జూలై 31: ప్రభుత్వ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయకూడదని నసీం గిలానీ విమర్శించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారన్న అభియోగంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీ తనయుడు నసీం గిలానీని విచారణకు పిలిచింది.

08/01/2017 - 02:00

పాట్నా, జూలై 31: నితీశ్‌కుమార్ నేతృత్వంలో బిహార్‌లో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేసింది. బిజెపి మద్దతుతో జెడి(యు) ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుందని, ఈ విషయంలో కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది.

08/01/2017 - 02:00

ముంబయి, జూలై 31: ముంబయిలో శనివారం ఒక బాలుడు (14) అకారణంగా బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం సంచనాన్ని సృష్టిస్తోంది. దీంతో ఈ ఘటనకు, అతని స్నేహితులు చర్చించుకుంటున్న ఆన్‌లైన్ క్రీడ ‘బ్లూ వేల్’ సూసైడ్ చాలెంజ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

08/01/2017 - 01:22

పాట్నా, జూలై 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దీటైన నాయకుడు ప్రస్తుతం దేశంలో లేరని, 2019 ఎన్నికల్లో ఆయన్ను సవాలు చేసి నిలబడగల సత్తా ఎవరికీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుని ఎన్డీయేతో జతకట్టిన తరువాత నితీష్ మోదీపై ప్రశంసలు కురిపించారు.

Pages