-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 31: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం కాస్త ఊరట నిచ్చింది. ఇన్కమ్టాక్స్ రిటర్న్స్ (ఐటిఆర్)కు ఆఖరి తేదీని జూలై 31నుంచి ఆగస్టు 5వరకు పొడిగించారు. పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ,జూలై 31:రాజ్యాంగ హోదాతో కూడిన జాతీయ వెనుకబడిన కులాల కమీషన్ కల ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే లోక్సభ ఆమోదించిన జాతీయ బీసీ కమీషన్ ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సోమవారం రాజ్యసభ సవరించింది. కమీషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యుల నియామకానికి సంబందించి అత్యంత ముఖ్యమైన మూడో క్లాజుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవటంతో బిల్లు వీగిపోయింది.
పాట్నా, జూలై 30: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి ముందు ఈ విషయమై ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. నితీశ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఫోన్చేసి, మహా కూటమిని విచ్ఛిన్నం చేస్తున్నందుకు తనను క్షమించాల్సిందిగా వేడుకున్నారని ఎన్డిటివి వెబ్ పోర్టల్ వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూలై 30: భారత్లోని 29 నగరాలు, పట్టణాలు తీవ్ర భూకంపం సంభవించే జోన్లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సిఎస్) తెలిపింది. ఈ జోన్లో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులు కూడా ఉన్నాయి. హిమాలయా పర్వత ప్రాంతాలు ప్రపంచంలోని తీవ్ర భూకంపం సంభవించే కేంద్రాలలో ఒకటిగా ఎన్సిఎస్ పేర్కొంది.
జమ్ము, జూలై 30: కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ పతాకాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసే అధికారం ఆమెకు లేదని అన్నారు. అత్యంత పవిత్రంగా భావించే జాతీయ పతాకంపై వ్యాఖ్యలు చేసి భారతీయుల మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు.
జమ్మూ/న్యూఢిల్లీ, జూలై 30: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ఆదివారం జమ్మూలో వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ అనుచరుడికి చెందిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గిలానీతో అత్యంత సన్నిహితుడైన న్యాయవాది ఇంటితోపాటు కార్యాలయంలో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారని, త్వరలో ఆయనను ప్రశ్నించబోతోందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఎ జమ్మూలో సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి.
డార్జిలింగ్, జూలై 30: ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమకారుల నిరసన ర్యాలీలతో చౌక్బజార్ ప్రాంతం ఆదివారం హోరెత్తింది. శనివారం ఉద్యమకారులపై పోలీసుల దమనకాండకు నిరసనగా జిజెఎం ఆదివారం నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్రం జోక్యం చేసుకోవాలని జిజెఎం నేతలు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, జూలై 30: గుజరాత్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమవైపుకు తిప్పుకునేందుకు బిజెపి ఎలాంటి ప్రయత్నం చేయలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపి తనవైపు తిప్పుకుంటోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది.
బెంగళూరు, జూలై 30: గుజరాత్ కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆదివారం ఆసక్తికర మలుపు తిరిగాయి. ఈ ఎమ్మెల్యేలందర్నీ ఇక్కడ ఓ రిసార్ట్లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ, వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టింది. తమ పార్టీనుంచి ఎలాంటి వలసలు జరగడం లేదని, ఇవన్నీ కల్పితాలేనని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జూలై 30: బోఫోర్స్ కేసు మళ్లీ తెరపైకి రానుంది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు 2005, మే 31న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బిజెపి నేత, న్యాయవాది అజయ్కుమార్ అగర్వాల్ సుప్రీంలో పిటిషన్ వేసిన నేపథ్యంలో బోఫోర్స్ కేసు మళ్లీ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టించనుంది.