S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/30/2017 - 05:35

న్యూఢిల్లీ, జూలై 29: గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, అధికార బిజెపి పాల్పడుతున్న అధికార దుర్వినియోగంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు శనివారం ఓ వినతిపత్రం సమర్పించింది.

07/30/2017 - 05:29

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్షవర్దన్, సినీనటుడు రణ్‌దీప్ హూడా

07/30/2017 - 05:27

చండీగఢ్, జూలై 29: ప్లస్ లోగో ఉన్నవాళ్లంతా వైద్యులే. కానీ, ఇకనుంచి ప్లస్ డాక్టర్ ఉంటే మాత్రం అలోపతి వైద్యులని అర్థం. ఈమేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్త లోగోను రిజిస్టర్ చేసుకుంది. దానిపై పేటెంట్ సైతం తీసుకుంది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన అలోపతి వైద్యులంతా ఇకనుంచి ‘డాక్టర్ ప్లస్’ లోగో వాడుకుంటారు. ఆయుర్వేదం, హోమియోపతి, నాటువైద్యం.. ఇలా ఏ తరహా వైద్యులైనా ‘ప్లస్’ సింబల్‌ను వాడటం జరుగుతోంది.

07/30/2017 - 05:25

జమ్మూ, జూలై 29: జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండాను చులకన చేసి మాట్లాడడంపై రాష్ట్ర బిజెపి తీవ్రస్థాయిలో మండిపడింది. కాశ్మీర్ లోయలోని వేర్పాటువాదం, మత ఛాందసవాదం కారణంగా కాశ్మీర్ సంస్కృతికి తీవ్ర ముప్పు ఎదురవుతోందని, దాన్ని కాపాడుకోవడమే మన ముందున్న పెను సవాలని అభిప్రాయ పడింది.

07/29/2017 - 03:16

న్యూఢిల్లీ, జూలై 28: గుజరాత్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం సెగ శుక్రవారం రాజ్యసభకు తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభ్యులు బిజెపిలో చేరటంపై రాజ్యసభలో గందరగోళం రేగింది. అధికార, విపక్ష సభ్యుల పరస్పరారోపణలతో రాజ్యసభ నాలుగు సార్లు వాయిదా పడింది. చివరకు ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే సోమవారానికి వాయిదా పడింది. బిజెపి నేతలు తమ ఎమ్మెల్యేలను అపహరిస్తున్నారని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది.

07/29/2017 - 02:09

న్యూఢిల్లీ, జూలై 28: విమాన టికెట్ల బుకింగ్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. విమాన టికెట్లకు ఆధార్ నంబర్‌ను ఇవ్వాలా అంటు పలువులు ఎంపీలు సందేహం వ్యక్తం చేయడంతోపాటు కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ద్వారా వివరణ కోరారు. ఇదే విషయం పార్లమెంటు స్థాయి సంఘం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పి చిదంబరం సారధ్యంలోని స్థాయి సంఘానికి కేంద్రం వివరించింది.

07/29/2017 - 02:09

అహ్మదాబాద్, జూలై 28: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, శుక్రవారం మరో ఇద్దరు శాసన సభ్యులు రాజీనామా చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా పార్టీకి రాజీనామా చేసినప్పటినుంచి ఆయనకు మద్దతుగా పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటికి అయిదుకు చేరుకుంది.

07/29/2017 - 02:08

న్యూఢిల్లీ, జూలై 28: రాజ్యసభకు ఐదోసారి ఎన్నికయ్యేందుకు రంగంలోకి దిగిన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఓడించటం ద్వారా కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రిని నైతికంగా దెబ్బతీసేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, అసమ్మతి నాయకుడు శంకర్‌సింగ్ వఘేలా వేసిన ఎత్తుగడ పారుతుందా?

07/29/2017 - 02:08

గాంధీనగర్, జూలై 28: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బల్వంత్ సిన్హా రాజ్‌పుట్ శుక్రవారం రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్లు దాఖలు చేశారు. సిన్హా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గురువారమే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా, ఇరానీలను బిజెపి కేంద్ర కమిటీ ఎంపిక చేసింది. బల్వంత్ విషయానికొస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా పనిచేశారు.

07/29/2017 - 02:06

పాట్నా, జూలై 28: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించింది. ప్రభుత్వానికి అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. 243సభ్యులుండే అసెంబ్లీలో వివిధ కారణాల వల్ల నలుగురు సభ్యులు ఓటు వేయలేక పోవడంతో ఓటింగ్ సమయంలో అసెంబ్లీ బలం 230కి తగ్గిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో విజయం సాధించాలంటే కొత్త ప్రభుత్వానికి 120 ఓట్లు అవసరం.

Pages