-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 26: దిగువస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానా, అరుణాచల్తోపాటు పది రాష్ట్రాలు ఇంకా అమలు చేయటం లేదు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్సభకు తెలియజేశారు.
న్యూఢిల్లీ, జూలై 26: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్కు గుజరాత్ కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు శంకర్సింగ్ వాఘేలా సింహస్వప్నంగా మారారు. ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసిన వాఘేలా మూలంగా అహ్మద్ పటేల్ ఆరోసారి రాజ్యసభకు ఎన్నిక కావటం ప్రశ్నార్థకంగా మారింది. వాఘేలా బిజెపి ఆధ్యక్షుడు అమిత్ షాతో చేతులు కలపటంతో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావటం కష్టంగా మారింది.
న్యూఢిల్లీ, జూలై 26: నక్సలైట్ సమస్యను మరింత తీవ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సిఆర్పిఎఫ్ దళాలు వినియోగిస్తున్న సాంప్రదాయక ఇన్సాస్ ఆయుధాల స్థానే ఎకె సిరీస్ రైఫిల్స్ను అందించాలని సంకల్పించింది. నక్సల్ పీడిత పది రాష్ట్రాల్లోని సిఆర్పిఎఫ్ దళాలకు ఈ ఆయుధాలను అందించబోతోంది.
లోహర్దాగా, జూలై 26: జార్ఖండ్లో వరదలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయ. లోహర్దాగా జిల్లాలోని కోయెల్ నది ప్రవాహంలో ఓ అంబులెన్స్ కొట్టుకుపోయింది. అంబులెన్స్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులున్నట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. పక్షవాతానికి గురైన ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు వ్యక్తులు అంబులెన్స్తోపాటు కొట్టుకుపోయారని వారన్నారు.
న్యూఢిల్లీ, జూలై 26: రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో నిరసన తెలియజేస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన బిజెపి సభ్యుడు అనురాగ్ ఠాకూర్ బుధవారం క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే క్షమించేది లేదంటూ స్పీకర్ ఆయనను గట్టిగా హెచ్చరించారు.
న్యూఢిల్లీ, జూలై 26: ఇరాక్లోని మోసుల్లో అపహరణకు గురయిన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం చెప్పారు. అందువల్ల వారంతా చనిపోయినట్లు ప్రకటించే పాపం తాను చేయబోనని ఆమె స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జూలై 26: భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించే అవకాశం ఉన్నప్పటికీ దీనికి కొన్ని రకాల పరిమితులు అవసరమని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో వివరించింది. వ్యక్తిగత గోప్యతా హక్కుకు సంబంధించి అనేక అంశాలు ముడివడి వున్నందున దీన్ని పరిపూర్ణమైన రీతిలో ప్రాథమిక హక్కుగా పరిగణించజాలమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 26: వైషమ్యదాడులు అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా భారత శిక్షాస్మృతి (ఐపిసి)లో కొత్త నిబంధనలు చేర్చే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. జాతి, మత, భాష ప్రాతిపదికన లేదా ఇతరత్రా జరిగే హింసాత్మక దాడులను నిరోధించాలన్న లక్ష్యంతోనే ఈ యోచన చేస్తోంది.
పాట్నా, జూలై 26: బీహార్ రాజకీయాలు బుధవారం నాటకీయ పరిణామాలతో అట్టుడికాయి. ఆర్జేడీతో తలెత్తిన విభేదాలు పరాకాష్టకు చేరడంతో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన పదవికి అనూహ్యరీతిలో రాజీనామా చేశారు. ఆర్జేడీతో గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేధాలకు తెరదించుతూ తెగతెంపులకు సిద్ధమయ్యారు.
పాట్నా, జూలై 26: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకస్మికంగా రాజీనామా చేయటంపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార కూటమిని చీల్చి విపక్షంతో జత కట్టడం వెనుక నితీశ్పై ఉన్న హత్యారోపణలే కారణమని లాలూ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మహాకూటమి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.