S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/26/2017 - 20:40

న్యూఢిల్లీ,జూలై 26: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెరగటం లేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పార్లమెంటు ఆవరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దాదాపు ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపిన అనంతరం విలేకరులతో మాట్లాడుడూ రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు ప్రస్తుతానికి పెరగటం లేదని కుండబద్దల కొట్టినట్లు చెప్పారు.

07/26/2017 - 20:29

న్యూఢిల్లీ, జూలై 25: భారత దేశ పధ్నాల్గవ రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. చరిత్రాత్మక పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మంగళవారం 12.11 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

07/25/2017 - 20:09

న్యూఢిల్లీ: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞాన ఖని అని, అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయన మార్గదర్శకత్వం తనకు అన్ని సందర్భాల్లో ఎంతగానో ఉపయోగపడిందని ప్రశంసించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఎంపిక చేసిన ప్రసంగాల నాలుగో సంపుటాన్ని సోమవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

07/25/2017 - 02:59

న్యూఢిల్లీ, జూలై 24: ఆర్కిటెక్ట్స్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 1972కు చెందిన ఈ చట్టం సవరణకు సబంధించి గత ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఆర్కిటెక్ట్స్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఈ బిల్లును ఉపసంహరించుకున్నట్టు కేంద్ర హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే సోమవారం రాజ్యసభకు తెలిపారు. గత ప్రభుత్వం 2010లో దీన్ని రాజ్యసభలో ప్రతిపాదించింది.

07/25/2017 - 02:44

పెద్దపల్లి రూరల్, జూలై 24: మండలంలోని చీకురాయి గ్రామం వద్ద ఇనుప సామాగ్రితో కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 38 గేట్ హోం సిగ్నల్‌ను సోమవారం ఢీకొట్టింది. దీంతో ఆ సిగ్నల్ విరిగి పడగా, రైల్వే విద్యుత్ స్తంభాలు వంగి పోయ కాజీపేట-బల్లార్ష జంక్షన్ల మధ్య రైళ్ల రాక పోకలకు సుమారు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పడాల్సి వచ్చింది.

07/25/2017 - 02:04

శ్రీనగర్, జూలై 24: అమర్‌నాధ్ యాత్రపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ మిలిటెంట్లకు సహాయపడిందని, దాడికి సంబంధించి వ్యూహరచన ఆ సంస్థపనేనని సోమవారం పోలీసులు వెల్లడించారు. జూలై 10న అమర్‌నాథ్ యాత్రపై జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది మృతి చెందారు. కేసు దర్యాప్తునకు సంబంధించి మరిన్ని వివరాలను కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనరల్ మునీర్‌ఖాన్ మీడియాకు వెల్లడించారు.

07/25/2017 - 02:04

శ్రీనగర్/న్యూఢిల్లీ, జూలై 24: జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ కార్యకలాపాలకు ఉగ్రవాద సంస్థల నుంచి నిధుల సమీకణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏడుగురు వేర్పాటువాదులను అరెస్టు చేసింది. హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీ అల్లుడు అల్త్ఫా అహ్మద్ షా అరెస్టయినవారిలో ఉన్నాడు. కాశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ఎన్‌ఐఏ దృషి సారించింది.

07/25/2017 - 02:01

న్యూఢిల్లీ, జూలై 24: రాష్టప్రతి పదవి నుంచి త్వరలో వైదొలగబోతున్న ప్రణబ్ ముఖర్జీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రశంసల వర్షాన్ని కురిపించారు. రాజ్యాంగ సంరక్షకుడిగా దాని ఔచిత్యాన్ని ఎల్లవేళలా సమర్ధించిన ప్రణబ్ రాష్టప్రతి పదవిలో ఎంతో హుందాగా వ్యవహరించారని, తద్వారా ఆయన అనేక మందికి అభిమానపాత్రులయ్యారని జైట్లీ శ్లాఘించారు.

07/25/2017 - 02:01

న్యూఢిల్లీ, జూలై 24: విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలంలో ఉపాధి హామీ పథకం నిధుల్లో గోల్‌మాల్ వాస్తవమేనని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ వెల్లడించారు. సోమవారం నాడు రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

07/25/2017 - 19:23

న్యూఢిల్లీ: ఎన్‌డిఏ ఉపరాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేశ్ సోమవారం తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఉపరాష్టప్రతి ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ వెంకయ్యను లక్ష్యం చేసుకుంది. వెంకయ్యనాయుడిపైనా, ఆయన కూతురు, కుమారుడికి సంబంధించిన అంశాలపైనా జయరాం ఆరోపణలు గుప్పించారు.

Pages