-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
జమ్మూ, జూలై 18: జమ్మూ, కాశ్మీర్లో అధీన రేఖ వెంబడి పాక్ సైనికుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక ఆర్మీ జవానును, మరో బాలికను పొట్టన పెట్టుకున్న పాక్ సైన్యాలు మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి రాజౌరి, పూంఛ్ జిల్లాలో అధీన రేఖ వెంబడి నివాస ప్రాంతాలపై పెద్దఎత్తున మోర్టార్ గుళ్ల వర్షం కురిపించడంతోపాటుగా కాల్పులకు తెగబడ్డాయని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బెంగళూరు/న్యూఢిల్లీ, జూలై 18: రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ జెండాను రూపొందించుకునే చర్యలను కర్నాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్య వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఏ రాష్టమ్రూ సొంత జెండాను కలిగి ఉండకూడదన్న నిబంధన రాజ్యాంగంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
బెంగళూరు, జూలై 18: పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అన్నాడిఎంకె (అమ్మ) పార్టీ అధినేత్రి వికె శశికళకు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపైన, అలాగే జైల్లో చోటు చేసుకొంటున్న ఇతర అక్రమాలపైన దర్యాప్తు జరపడానికి కర్నాటక ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ను నియమించింది.
శ్రీనగర్, జూలై 18: డ్యూటీలో సెల్ఫోన్లు వాడకూడదన్నందుకు ఓ ఉన్నతాధికారిని ఓ జవాను కాల్చి చంపాడు. ఏకంగా ఐదు బులెట్లు శరీరంలో దిగడంతో ఆ మేజర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన ఊరి సెక్టార్లో మంగళవారం జరిగింది. అత్యంత సునిశితమైన ప్రాంతంలో సెల్ఫోన్ వినియోగించినందుకు నాయక్ రేసన్ అనే జవాన్ను మేజర్ షికార్ థాపా మందలించాడని, అంతే కాకుండా అతడి నుంచి ఫోన్ లాక్కునేందుకూ ప్రయత్నించాడని తెలుస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 18: తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ మరోసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్గా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ నియామకం చేసినట్లు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. ఏంఏ ఖాన్ నాలుగేళ్ల నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్గా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది.
ఇరవైకి పైగా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న హర్ ప్రకాష్ రిషి అలియాస్ గిన్నిస్ రిషి మంగళవారంనాడు ఉపరాష్టప్రతి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చారు. మెళ్లో మెడల్స్ వేసుకుని, విజయ దరహాసంతో వస్తున్నది ఆయనే!
కోహిమా, జూలై 18: మైనార్టీలో పడ్డ నాగాలాండ్ ముఖ్యమంత్రి షుర్హోజిలి లిజిత్సు ప్రభుత్వ భవితవ్యం బుధవారం తేలబోతోంది. బలపరీక్ష ను ఎదుర్కోవాలంటూ గవర్నర్ పిబి ఆచార్య జారీ చేసిన ఆదేశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేద ని గౌహతి హైకోర్టు కోహిమా బెంచి న్యాయమూర్తి ఎల్ఎమ్ జమీర్ మంగళవారం స్పష్టం చేశారు. దీనిపై స్టే ఇవ్వాలంటూ లిజిత్సు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించారు.
న్యూఢిల్లీ, జూలై 18:కేంద్ర ప్రభు త్వ వివిధ పద్దుల కింద విడుదల చేసిన నిధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆడిట్ చేసిన లెక్కల వివరాలు సమర్పించిన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక సాయం విడుదల చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘవాల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం పద్దెనిమిది గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వీటిలో భోగాపురంతోపాటు మరో ఆరు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్ అనుమతి కూడా లభించింది.
హైదరాబాద్, జూలై 18: భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను మళ్లించింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. బ్రిడ్జి నెం. 588వద్ద భారీ వర్షపు ప్రమాదకర హెచ్చరిక నేపథ్యంలో సింగపూర్-తెరుబాలి మధ్య, ఈస్ట్కోస్ట్ రైల్వే పలు రైళ్లను మళ్లించింది.