S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/30/2017 - 06:07

దురాచారం అంతానికి ముందుకు రండి ముస్లిం మతపెద్దలకు ప్రధాని పిలుపు
మీనుంచే సంస్కరణవాదులు పుట్టుకొస్తారు ఆ నమ్మకం తనకుందన్న నరేంద్ర మోదీ

04/29/2017 - 03:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తమప్రాంతాల్లోని ఉగ్రవాదుల అడ్డాలకు ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనాస్టాసియాడెస్‌లు శుక్రవారం గట్టిగా కోరారు.

04/29/2017 - 03:00

న్యూఢిల్లీ, మే 28: రైతు ఆదాయంపై పన్ను విధించాలా వద్దా అనే విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలంటూ నీతి ఆయోగ్ సభ్యు డు బిబేక్ దేబ్‌రాయ్ సూచించడం ఈ వివాదం తలెత్తడానికి ప్రధాన కార ణం.

04/29/2017 - 02:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితుడు శ్రీకాంత్ పురోహిత్ బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మాజీ లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్‌కు బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అన్ని పిటిషన్లలానే విచారణ జరుతాము తప్ప అత్యవసరంగా చేపట్టలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నేతృత్వంలోన ధర్మాసనం స్పష్టం చేసింది.

04/29/2017 - 02:57

లక్నో, ఏప్రిల్ 28: దేశంలోనే అత్యంత సమస్యాత్మకమైన ఉత్తరప్రదేశ్‌లో శాంతి, భద్రతలతో పాటు పరిపాలనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, అధికారులు నిరంతరం పనిచేసేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అధికారులను హెచ్చరిస్తూ ఆయన ప్రభుత్వం శుక్రవారం ఒక నోటీసు జారీ చేసింది.

04/29/2017 - 02:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో ఆమ్యామ్యాలు (చిన్న మొత్తాల్లో జరిగే అవినీతి) బాగా తగ్గిందని, అయితే గత సంవత్సర కాలంలో కుటుంబాలు ప్రభుత్వ సేవలను పొందడానికి ఇచ్చిన లంచాల మొత్తం రూ. 6,350 కోట్లని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మొత్తంలో రూ. పది నుంచి ఇచ్చిన లంచాలు ఉన్నాయని తెలిపింది.

04/29/2017 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: సిఆర్‌పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రాయ్ భట్నాగర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ జరిపిన మెరుపుదాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన కొద్ది రోజులకే భట్నాగర్ పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

04/29/2017 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ‘హలో, నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను. కాని, నేను ఇకముందు ఆ పని చేయాలని కోరుకోవడం లేదు. భారత్‌లో ఉండిపోవాలని కోరుకుంటున్నాను’ అని ఎయిర్ ఇండి యా విమానంలో దుబాయి నుంచి ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి శుక్రవారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలివి.

04/29/2017 - 03:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో భూమి కొనుగోలు సంబంధించి ఒక్కపైసా పెట్టుబడి పెట్టకుండా 50 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఎస్‌ఎన్ డింగ్రా కమిషన్ వెల్లడించింది. 2008లో హర్యానలో భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై డింగ్రా కమిషన్ విచారణ జరిపింది.

04/29/2017 - 03:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: హర్యానాలో అమీర్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని నా స్వంత డబ్బుతో కొనుగోలు చేశాను, ఈ భూమి కొనుగోలుకు తన భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక వ్యవహారాలు, స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.

Pages