S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/29/2017 - 01:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తేలేదని కేంద్రం స్పష్టం చేసింది. వేర్పాటువాదులు గానీ, ఆజాదీ కోసం డిమాండ్ చేస్తున్న సంస్థలతోగానీ సంప్రదింపుల ఉద్దేశమేలేదని సుప్రీం కోర్టుకు తెలిపింది. పెల్లెట్ గన్స్‌ను వాడడానికి సవాల్ చేస్తూ జమ్మూకాశ్మీర్ బార్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

04/29/2017 - 01:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అలవెన్సులపై పది నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఇంటిఅద్దె అలవెన్సు(హెచ్‌ఆర్‌ఏ) గరిష్ఠంగా 178 శాతం పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అలవెన్సులపై ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా నేతృత్వంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తన నివేదికను సమర్పించింది.

04/28/2017 - 02:51

సిమ్లా, ఏప్రిల్ 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

04/28/2017 - 02:48

భోపాల్, ఏప్రిల్ 27: ‘కాషాయ ఉగ్రవాదం’లో తన పాత్రను అంగీకరించేలా చేయడానికి ముంబయి ఎటిఎస్ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసిందని 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బెయిలుపై విడుదలైన సాధ్వి ప్రగ్యాసింగ్ ఆరోపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బెయిలుపై జైలునుంచి విడుదలైన ఆమె గురువారం తొలిసారిగా విలేఖరులతో మాట్లాడారు. ‘తొమ్మిదేళ్లుగా నేను జైల్లో ఉన్నాను.

04/28/2017 - 02:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జమ్ము కాశ్మీర్ పోలీస్ దళంలోకి వెయ్యి మంది మహిళలతో బలమైన ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మహిళా పోలీసులు అయిదు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌లలో భాగంగా ఉంటారు.

04/28/2017 - 02:41

సూళ్లూరుపేట, ఏప్రిల్ 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మే 5న జిఎస్‌ఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం జరపనుంది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన 2230కిలోల బరువుగల జీశాట్-9 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

04/28/2017 - 02:39

లక్నో, ఏప్రిల్ 27: అయోధ్యలో అనేక ఏళ్ల క్రితం నిలిపివేసిన సంప్రదాయ రామ్ లీల నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నాటకాన్ని గతంలో ప్రదర్శించేవారు. అలాగే మథురలో రాస్ లీల కార్యక్రమాన్ని, చిత్రకూట్‌లో భజన్ సంధ్యా కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా సిఎం ఆదేశించారు.

04/28/2017 - 02:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏవో కారణాలు చూపి పెండింగ్‌లో ఉంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టం కింద లోక్‌సభలో ప్రతిపక్ష నేతను లోక్‌పాల్ సెలక్షన్ ప్యానెల్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

04/28/2017 - 02:37

శ్రీనగర్, ఏప్రిల్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పంజ్‌గావ్‌లోని సైనిక శిబిరంపై ముగ్గురు సాయుధ మిలిటెంట్లు దాడి చేసి ఒక కెప్టెన్‌ను, ఇద్దరు సైనికులను కాల్చి చంపారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడి తర్వాత దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన భీకర ఎన్‌కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతం కాగా, మరొకరు తప్పించుకున్నాడని శ్రీనగర్, న్యూఢిల్లీలోని ఆర్మీ అధికారులు చెప్పారు.

04/28/2017 - 02:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ప్రజారవాణా వ్యవస్థ అయిన రైల్వేలను సామాన్యుడికి మరింత చేరువచేస్తామని గురువారం ఇక్కడ ప్రకటించారు. భవిష్యత్‌లో రైల్వే రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు.

Pages