S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/18/2017 - 02:48

చిత్రాలు.. జమ్ము-కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం శ్రీనగర్-క్వాజిగుండ్ రైల్వే ట్రాక్‌పై పేరుకుపోయన మంచు.
*జమ్ము-శ్రీనగర్ హైవే మూసివేయడంతో జాతీయ రహదారిలో నిలిచిపోయన ట్రక్కులు

01/18/2017 - 02:44

చెన్నై: ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ నూరవ జయంతి వేడుకలను మంగళవారం చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్మృత్యర్థం విడుదల చేసిన స్టాంపును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అందజేస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ

01/18/2017 - 02:41

న్యూఢిల్లీ, జనవరి 17: అంతర్జాతీయ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాసే జవాన్లకు నాణ్యమైన ఆహారం విషయంలో ఏ విధమైన రాజీకి తావులేదని సరిహద్దు భద్రతాదళం (బిఎస్‌ఎఫ్) ప్రకటించింది. తమకు సరైన ఆహారం ఇవ్వటం లేదని సైనికుల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిఎస్‌ఎఫ్ వివరణ ఇచ్చింది.

01/18/2017 - 02:37

పాటియాలా, జనవరి 17: పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌ను గెలిపించేందుకే తాను లాంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను పిసిసి చీఫ్, మాజీ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొట్టిపారేశారు. కేజ్రీవాల్‌కు దమ్ముంటే లాంబినుంచి ఎన్నికల్లో పోటీకి రావాలని ఆయన సవాలు చేశారు.

01/18/2017 - 02:35

డెహ్రాడూన్, జనవరి 17: ఉత్తరాఖండ్‌లో వచ్చే నెల 15న జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌నుంచి ఫిరాయించిన వారందరికీ దాదాపుగా టికెట్లు ఇవ్వడంపై పార్టీలోని ఒక వర్గం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతోంది. బయటినుంచి దిగుమతి అయినవారికి అవకాశం ఇవ్వడానికి పార్టీకోసం ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల పార్టీ నేతలు పలువురు మనస్తాపంతో ఉన్నారు.

01/18/2017 - 02:33

ముంబయి, జనవరి 17: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయికి చెందిన షీనాబోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ, మాజీ భర్త సంజీవ్ ఖన్నాలపై మంగళవారం స్థానిక సిబిఐ కోర్టులో హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేయడంతో వారిపై విచారణ ప్రారంభం కావడానికి రంగం సిద్ధమయింది.

01/18/2017 - 02:31

లక్నో, జనవరి 17: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ వేగంగా మారిపోతున్నాయి. అధికార సమాజ్‌వాది పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొనటం, ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గాన్ని అసలైన సమాజ్‌వాదిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి, సైకిల్ గుర్తునూ ఆయనకే కేటాయించటంతో ప్రధాన పక్షాలైన బిజెపి, బిఎస్‌పీలు కొత్తగా తమ వ్యూహాన్ని రచించుకోవలసిన అవసరం ఏర్పడింది.

01/18/2017 - 02:30

న్యూఢిల్లీ, జనవరి 17: సమాజ్‌వాదీ పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తును తమకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో అఖిలేశ్ వర్గం వ్యూహాత్మకంగా మరో అడుగు ముందుకేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తన తండ్రి ములాయం సారథ్యంలోని బృందం ఎక్స్‌పార్టీ ఉత్తర్వులను తెచ్చుకోకుండా ఉండేందుకు సుప్రీం కోర్టులో మంగళవారం కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

01/18/2017 - 02:29

లక్నో, జనవరి 17: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్‌కు మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11న తొలి దశలో 73 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింల ప్రాబల్యం ఉన్న 15 జిల్లాల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతాయి.

01/18/2017 - 02:18

న్యూఢిల్లీ, జనవరి 17: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అఖిలేశ్ యాదవ్ వర్గానికే సైకిల్ గుర్తు లభించటంతో సమాజ్‌వాదీతో పొత్తుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

Pages