-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చెన్నై, జనవరి 16: జయలలిత మరణం వలన రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు లబ్ధి పొందకుండా చూడాలని ఇటీవల ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వికె.శశికళ సోమవారం తమ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
న్యూఢిల్లీ, జనవరి 16: తాను జన్మతః కాంగ్రెస్వాదినంటూ మాజీ క్రికెటర్, బిజెపి మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధు అందరినీ ఆశ్చర్యపరిచారు. సిద్ధు సోమవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తాను అధికారికంగా కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, జనవరి 16: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) రూపొందించిన క్యాలెండర్, డైరీలపై మహాత్మాగాంధీ బొమ్మను తొలగించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రచురించటంపై రేగిన వివాదంపై ప్రధాని కార్యాలయం సోమవారం స్పందించింది. పిఎంఓ అనుమతి తీసుకోకుండానే కెవిఐసి గాంధీజీ బొమ్మను తొలగించటం క్షమించరాని తప్పని పిఎంఓ అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ, జనవరి 16: పెద్ద నోట్ల రద్దు విషయమై ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించాల్సిన సమావేశాన్ని పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, జనవరి 16: ముంబయికి చెందిన 22 ఏళ్ల మహిళ గర్భంలో పెరుగుతున్న శిశువుకు పుర్రె భాగం లేకపోవడంతో ఆ పిండాన్ని తొలగించుకునేందుకు సుప్రీం కోర్టు సోమవారం ఆమెకు అనుమతి ఇచ్చింది.
లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో పుట్టిన ముసలం అంతిమంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడినే ముంచేసింది. నిట్టనిలువునా చీలిన సమాజ్వాదీ పార్టీ చిహ్నమైన సైకిల్ కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగిన పోరాటంలో తనయుడిదే పైచేయి అయ్యింది. తానే వ్యవస్థాపకుడిని, తనదే సైకిల్ అంటూ బల్లగుద్దిమరీ చెప్పిన అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్కు చుక్కెదురైంది.
న్యూఢిల్లీ, జనవరి 16: ఉమ్మడి ఆంధ్ర విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఆవిర్భవించి రెండేళ్లవుతుంటే, విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లు తాజాగా సోమవారం విచారణకు వచ్చాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉమ్మడి ఏపీని విడగొట్టారంటూ 2014లోనే వివిధ వర్గాలనుంచి సుప్రీంలో దాఖలైన సవాల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సాధారణ విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 16: 3సుప్రీం కోర్టు అనుకుంటున్నారా? లేక పరిహాసాల కోర్టుగా భావిస్తున్నారు. ఏమిటీ నిర్లక్ష్యం2 అంటూ రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిప్పులు చెరిగింది. కాలుష్యం, మధ్యాహ్న భోజన పథకాల్లో పరిశుభ్రత లేకపోవడం వంటి ప్రజా ప్రాధాన్యతాంశాల విషయంలో రాష్ట్రాల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఎందుకు జావాబు ఇవ్వడంలేదంటూ నిలదీసింది.
ముంబయి, జనవరి 16: క్రమానుగతంగా నగదు లభ్యత విషయంలో మెరగవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆర్బీఐ మరింత వెసులుబాటును కల్పించింది. వారంలో 24వేల గరిష్ట పరిమితి పెంచకపోయినా, ఏటిఎంల నుంచి రోజుకు పదివేల రూపాయలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే కరెంట్ అకౌంట్ కలిగిన ఖాతాదారుల విత్డ్రావెల్ పరిమిత మొత్తాన్ని వారానికి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచింది.
న్యూఢిల్లీ, జనవరి 16: గత కొంతకాలంగా కొరకరాని కొయ్యగా మారుతూ వచ్చిన పన్ను చెల్లింపుదారుల నియంత్రణకు సంబంధించి అధికారాలను పంచుకునే విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సోమవారం ఏకాభిప్రాయం కుదిరింది. దేశవ్యాప్తంగా చారిత్రక రీతిలో పరోక్ష పన్నుల వ్యవస్థను అమలు చేసే దిశగా పడిన తొలి అడుగుగా భావిస్తున్నారు.