S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2016 - 23:41

భోపాల్, నవంబర్ 17: కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీని ఇచ్చేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ముందుకొచ్చాడు.

11/18/2016 - 03:53

న్యూఢిల్లీ, నవంబర్ 17: స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. తిరుపతికి ఎనిమిదో స్థానం దక్కింది. గురువారంనాడు స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పది పట్టణాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో దేశ వ్యాప్తంగా 500 పట్టణాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్ ప్రథమ స్థానంలో నిలిచింది.

11/17/2016 - 23:40

భోపాల్, నవంబర్ 17: మధ్యప్రదేశ్‌లో షాదోల్ లోక్‌సభ, నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం జరగనున్న ఉప ఎన్నికలు అధికార బిజెపికి అగ్నిపరీక్షగా మారింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు నియోజకవర్గాలు ఎస్‌టి రిజర్వ్ సీట్లు.

11/17/2016 - 08:15

న్యూఢిల్లీ, నవంబర్ 16: మారుతున్న కాలానికి అనుగుణంగా తన పనితీరును మార్చుకోవడం ద్వారా మీడియా స్వయం నియంత్రణ సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బయటి జోక్యంవల్ల మీడియాలో పరిస్థితులు మారవని ఆయన నొక్కి చెప్పారు. మీడియా పనితీరులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులు హత్యలకు గురికావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

11/17/2016 - 08:11

ముంబయి, నవంబర్ 16: పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిజమైన నల్లధన కుబేరులు, నరేంద్ర మోదీని తమ విమానాలలో తిప్పిన, రూ.పది వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు గల వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీరెవరిపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.

11/17/2016 - 08:10

న్యూఢిల్లీ, నవంబర్ 16: వారి సేవలు నిరుపమానం... విద్యుక్త్ధర్మం అనిర్వచనీయం... గంటలు, రోజులు, వారాలు... వారంతా ఇళ్లకు దూరం. ఇంట్లో చిన్నారులు, భార్యాపిల్లల గురించి తెలుసుకునే తీరిక కూడా వారికి లేదు. తమ ఇళ్లల్లో చిల్లిగవ్వ ఉందో లేదో తెలియకపోయినా ఎటిఎంలను సకాలంలో నింపుతూ జనానికి నగదు భరోసా ఇస్తున్నారు. తమ పొట్ట నిండకపోయినా, కుటుంబం ఎలా ఉందో తెలియకపోయినా జనానికి సకాలంలో నగదును అందిస్తున్నారు.

11/17/2016 - 08:01

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలో ఉద్యోగాల సృష్టి ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యోగాల సృష్టి ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉండాలన్నారు.

11/17/2016 - 08:00

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలో ఉద్యోగాల సృష్టి ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యోగాల సృష్టి ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉండాలన్నారు.

11/17/2016 - 07:58

రేవారీ (హర్యానా), నవంబర్ 16: పెద్దనోట్ల రద్దువల్ల ఖాతాదారులకు మరోనెల రోజులు ఇబ్బందులు తప్పవని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడొక సభలో మాట్లాడిన రాజ్‌నాథ్ నల్లధనాన్ని ఏరివేయడానికి కఠినమైనా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా భవిష్యత్‌లో మంచి ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డారు.

11/17/2016 - 07:57

న్యూఢిల్లీ, నవంబర్ 16: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్స ద్వారా ఆమెకు పనిచేయని కిడ్నీ స్థానంలో మరో కిడ్నీని అమర్చడానికి అవసరమైన పరీక్షలు చేస్తున్నారు.

Pages