S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/22/2020 - 04:50

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఆదివారం (22న) ఇంటిలోనే ఉండిపోవడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని దెబ్బ తీయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శనివారం పిలుపు ఇచ్చారు.

03/22/2020 - 04:48

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడొద్దని, ఆ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో శనివారం నాడొక ఘటన తీవ్ర కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో క్వారంటైన్ సీల్ ఉన్న ఓ దంపతులు ప్రయాణిస్తున్నారు.

03/22/2020 - 04:47

న్యూఢిల్లీ, మార్చి 21: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యుల్లార్ అండ్ మాలిక్యులార్ బయోలాజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెంలగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేసిన విజప్తిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించవచ్చునని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపించింది.

03/22/2020 - 04:46

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ తీవ్రం కావడం తో కేంద్ర ఆరోగ్య శాఖ విస్తృత స్థాయి లో కీలక వైద్య చికిత్స చర్యలను చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివా రం దాదాపు వెయ్యి ప్రాంతాల్లో ఈ శిక్ష ణ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైరస్ కేసులు తీవ్రమయ్యే పక్షంలో అత్యవసరంగా ఏ విధంగా స్పందించాలన్న దానిపై ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణను అందించారు.

03/22/2020 - 04:45

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఆభివృద్ది, భారీ మందుల తయారీ పరిశ్రమల పార్కుల అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమికండక్టర్ల ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలను మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

03/22/2020 - 04:44

లక్నో, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుమారు 35 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అలాగే 1.65 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు ఒక నెల కోసం రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

03/22/2020 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆదివారం ప్రజలు ఆరోగ్య సంరక్షకులకు, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపనుండగా, అదే సమయంలో దేశ రాజధాని ప్రాంతంలోని అనేక మంది కొత్త కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌పీఆర్)ను తాజాపరచాలనే తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమ ఇళ్లలో నిలబడి చప్పట్లు కొట్

03/22/2020 - 01:30

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనాపై యుద్ధానికి యావత్ భారతం సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించటం ద్వారా కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలు సమాయత్తమయ్యారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఇళ్లలో ఉండిపోవటం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి గొలుసు తుంచేందుకు సిద్ధమయ్యారు. జనతా కర్ఫ్యూ ప్రభావం శనివారం నుంచే కనిపించటం ప్రారంభమైంది.

03/21/2020 - 17:22

న్యూఢిల్లీ: వదంతులు, పుకార్లు నమ్మవద్దని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 112 పరిశోధనాశాలలను ఏర్పాటుచేశామని, ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు జరిపించే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

03/21/2020 - 17:22

హైదరాబాద్: రేపు 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా చేసి దేశానికి ఆదర్శంగా నిలుద్దామని ఆయన అన్నారు. శనివారంనాడు ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ పాటించినట్లయితే దేశానికి సేవ చేసినట్లేనని అన్నారు.

Pages