S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/03/2016 - 08:01

ఖాట్మండు, ఆగస్టు 2: నేపాల్ మావోయిస్టు నాయకుడు పుష్క కమాల్ దహల్ ‘ప్రచండ’ రెండోసారి దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. బుధవారం జరుగనున్న ఎన్నికకు సంబంధించి ప్రచండ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మధేసీలు, నేపాల్ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్టు మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో దేశ కొత్త ప్రధానిగా ప్రచండ ఎన్నిక లాంఛనంగా మారింది.

08/03/2016 - 08:00

కోల్‌కతా, ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్ ఇక నుంచి బెంగాల్ కాబోతోంది. రాష్ట్రం పేరును బెంగాల్‌గా మార్చాలని రాష్ట్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్లంలో దీన్ని బెంగాల్‌గా, బెంగాలీ భాషలో బంగో లేదా బంగ్లాగా మార్చాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీ వెల్లడించారు.

08/03/2016 - 07:59

న్యూఢిల్లీ, ఆగస్టు 2: కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీని తొలగించి ఇతర నేతల చిత్రాలను ముద్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూపిఏ హయాంలో ఉన్నతస్థాయి కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో స్పష్టం చేసింది.

08/03/2016 - 07:59

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గుజరాత్‌లో నెలకొన్న పరిస్థితులకు ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ను బలిపశువును చేసినా ఆ రాష్ట్రంలో బిజెపిని ఎవరూ కాపాడలేరని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు పదమూడేళ్ల మోదీ పాలనే కారణమని, ఆనందిబెన్ పాలన ఎంతమాత్రం కాదని రాహుల్ తన ట్విట్టర్‌లో దుయ్యబట్టారు.

08/03/2016 - 07:36

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ మంగళవారం లోక్‌సభలో వినూత్న పద్ధతిలో ప్రత్యేక హోదా డిమాండ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మంగళవారం ఆయన సభకు స్వామి వివేకానంద గెటప్‌లో వచ్చారు. స్వామి వివేకానంద మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించినా తలపాగాగా మాత్రం కషాయ వస్త్రాన్ని కాకుండా తెలుగుదేశం పార్టీకి ప్రతిరూపమైన పసుపు రంగు బట్టని ధరించారు.

08/03/2016 - 07:27

న్యూఢిల్లీ,ఆగస్టు 2: 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొనలేదని కేంద్ర ఆర్థికశాఖ సహయమంత్రి అర్జున్ సింగ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీకి టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజి వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పుర్వక సమాధానం ఇచ్చారు.

08/03/2016 - 06:41

న్యూఢిల్లీ, ఆగస్టు 2:టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తెర వెనక చేసిన ప్రయత్నం మూలంగానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారనే మాట వినిపిస్తోంది.

08/03/2016 - 06:40

న్యూఢిల్లీ, ఆగష్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు,ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలను తాత్కాలిక విరమిస్తున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. టీడీపీ ఎంపీలతో కలసి ఆయన ఏపీభవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని లోక్‌సభలో అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అందుకే తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించామని తెలిపారు.

08/03/2016 - 06:39

న్యూఢిల్లీ,ఆగస్టు 2: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కుమ్మక్కు అయినందుకే ఏపికి ప్రత్యేక హోదా రావటం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎం.ఏ.ఖాన్ ఆరోపించారు.

08/03/2016 - 06:38

న్యూఢిల్లీ,ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు లోక్‌సభలో తమ ఉద్యమం కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. లోక్‌సభలో తాము లేనప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జేట్లి ఏపికి ప్రత్యేక సహాయం గురించి ప్రకటించటం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని ఆయన మంగళవారం విలేఖరులతో అన్నారు.

Pages