S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/01/2016 - 01:08

ముంబయి/్థనె, జూలై 31: మహారాష్టల్రోని ముంబయి మహానగరం, దానికి ఆనుకుని ఉన్న థానె, పాల్‌ఘర్ జిల్లాల్లో ఆదివారం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమయింది. థానె జిల్లాలోని భివాండి పట్టణంలో కుండపోత వర్షాలకు ఓ నివాస భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోగా, మరో పదిమంది గాయపడ్డారు.

08/01/2016 - 01:02

బులంద్‌షహర్, జూలై 31: ఉత్తరప్రదేశ్‌లో ఒక బందిపోటు దొంగల ముఠా జాతీయ రహదారిపై కాపుకాసి ఒక కారును అడ్డగించి అందులో ప్రయాణిస్తున్న ఒక 35 ఏళ్ల మహిళను, 13ఏళ్ల వయసు గల ఆమె కుమార్తెను కారులోంచి లాగి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

08/01/2016 - 01:02

న్యూఢిల్లీ, జూలై 31: సౌదీ అరేబియాలో పది వేలకు పైగా భారతీయ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను అందజేయడంతోపాటు ఇతరత్రా సహకరించాలని భారత ప్రభుత్వం సౌదీలోని తన దౌత్యసిబ్బందిని ఆదేశించింది.

08/01/2016 - 01:00

అహ్మదాబాద్, జూలై 31: గుజరాత్‌లో దళితులపై దాడులు పెరిగిపోవడానికి నిరసనగా ఆందోళన చేస్తున్న వేలాది మంది దళితులు ఆదివారం అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి చనిపోయిన పశులకు అంత్యక్రియలు నిర్వహించే తమ వృత్తిని వదిలిపెట్టాలని ఆ ర్యాలీలో ప్రసంగించిన దళిత నేతలు తమ కులం వారికి పిలుపునిచ్చారు.

08/01/2016 - 00:59

న్యూఢిల్లీ, జూలై 31: దేశవ్యాప్తంగా అయిదు లక్షల మంది రైల్వే ఉద్యోగులు, టిటిఇలు, గార్డులు, డ్రైవర్లకు భారత రైల్వేలు కొత్త డ్రస్‌కోడ్‌ను అమలు చేయబోతోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూబేరి ఈ యూనిఫామ్‌ను రూపొందిస్తున్నారు. భారత సంస్కృతిని ప్రతిబింబించే థీమ్‌వర్క్‌తో ఈ డ్రస్‌లను తయారుచేస్తారు. దీనికి సంబంధించి నాలుగు సెట్ల డిజైన్ వర్క్‌లను రైల్వే శాఖకు రీతూబేరి అయిదురోజుల క్రితమే సమర్పించారు.

08/01/2016 - 00:58

న్యూఢిల్లీ, జూలై 31: ఉత్తరాఖండ్‌లోని బారాహోతి ప్రాంతంలో చొరబడ్డ చైనా ఆర్మీ ఇంతకుముందు కూడా తన యుద్ధవిమానాల్ని భారత భూభాగంలోకి పంపించినట్లు మన ఆర్మీ గుర్తించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ట్యుపొలొవ్‌టు 153ఎం యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్లు సైన్యం గుర్తించింది.

08/01/2016 - 00:58

న్యూఢిల్లీ, జూలై 31: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు 12వ రోజుకు చేరుకోన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో ఎమ్మార్పీస్ మార్చ్‌పాస్ట్ నిర్వహించింది. వందలాదిగా హాజరైన యువకులు నీలరంగు టీషర్ట్‌లు ధరించి జంతర్‌మంతర్‌ను పరేడ్ గ్రౌండ్‌గా మార్చారు.

08/01/2016 - 00:57

శ్రీనగర్, జూలై 31: కాశ్మీర్‌లో పదిహేను రోజులుగా జరుగుతున్న అల్లర్లు విపరీత ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. వీటిల్లో మతోన్మాద శక్తులు ప్రవేశించి బాలికలు, వ్యాపారులు లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. శ్రీనగర్ నడిబొడ్డున ఆదివారం వెలసిన పోస్టర్లే ఇందుకు నిదర్శనం. ‘బాలికలూ... స్కూటీ లాంటి ద్విచక్ర వాహనాలు నడపకండి.

08/01/2016 - 00:56

న్యూఢిల్లీ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నా కేంద్రం హామీలను అమలు పరచడం లేదని మండ్డిపడ్డారు.

08/01/2016 - 00:55

న్యూఢిల్లీ, జూలై 31: వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలతో కలసి పనిచేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దైనందిన జీవనంలో ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరమైన పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

Pages