-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
లక్నో: యుపి మాజీ సిఎం, బిఎస్పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అరెస్టు వారంటుపై ‘స్టే’ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం నిరాకరించింది. దయాశంకర్ ప్రసుత్తం పరారీలో ఉండగా ఆయన తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూనే, ఈ విషయంలో వారంలోగా యుపి ప్రభుత్వం స్పందించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ : జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది.
శ్రీనగర్ : కొండచరియులు విరిగిపడుతుండడంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల
కు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అమర్నాథ్ వైపు వెళుతున్న 800 ముంది మధ్యలోనే ఆగిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటీవల కొన్ని రోజుల పాటు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. ముళ్లీ ఇప్పుడు యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి.
కోల్కత : ప్రముఖ రచయిత్రి పద్మ విభూషణ్ మహాశ్వేతాదేవి(90) కోల్కతలో గురువారం కన్నుమూశారు. 1926లో ఢాకాలో పుట్టిన మహాశ్వేతాదేవి కోల్కతలో రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీలో బిఏ చదివారు. కోల్కత యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 1964లో బిజోయ్గఢ్ కాలేజిలో బోధన ప్రారంభించారు. విద్యాభ్యాసం తర్వాత మహాశ్వేతాదేవి ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజోన్ భట్టాచార్యను వివాహమాడారు.
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను గురువారం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సిరోహి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రతికూల వాతావరణ ఎదురైంది. దీంతో రాజ్సమంద్ జిల్లాలోని ఓ గ్రామంలో హెలికాప్టర్ను అత్యవసరంగా దించినట్లు అధికారులు వెల్లడించారు.
జైపూర్ (రాజస్థాన్) : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నిర్దోషిగా రాజస్థాన్ హైకోర్టు తీర్పు వచ్చినా, తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజస్థాన్ న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ గురువారం అన్నారు. సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత- ఘటన సమయంలో సల్మాన్ వాహనాన్ని నడిపిన హరీశ్ దులానీ తనకు ప్రాణహాని ఉండటంతో కనబడకుండా పోయినట్లు చెప్పాడు.
ముంబయి: ఓ ప్రయాణికుడు గందరగోళం సృష్టించడంతో గురువారం దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా విమానసిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, ఫుడ్కార్ట్పై దూకి.. దానిపై కూర్చుని నానా బీభత్సం సృష్టించాడని, ప్రయాణికులతో వాగ్వాదానికి దిగినట్లు ఇండిగో పేర్కొంది.
దిల్లీ: కాశ్మీర్లో అల్లర్ల నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య మాటల యుద్ధం పెరిగిన వేళ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్ వెళుతున్నారు. వచ్చేనెల 3,4 తేదీల్లో ఇస్లామాబాద్లో జరిగే సార్క్ దేశాల ప్రతినిధుల సదస్సుకు ఆయన హాజరవుతున్నారు. కాశ్మీర్లో ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భద్రతాదళాలు హతమార్చిన అనంతరం శాంతిభద్రతలు అదుపుతప్పిన సంగతి తెలిసిందే.
ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభయ్యాయి. సెన్సెక్స్ 28,108 పాయింట్ల వద్ద నిఫ్టీ 8,636 వద్ద స్టార్ట్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో11 శాతం వాల్యూమ్ వృద్ధి సాధించిన ఏషియన్ పెయింట్స్ భారీగా లాభపడుతుండగా బుధవారం ఫలితాలను ప్రకటించిన భారతి ఎయిర్ టెల్, మారుతి సుజుకి కూడా లాభాలనార్జిస్తున్నాయి.
రామేశ్వరం, జూలై 27: తమిళనాడులోని రామేశ్వరం దశ తిరగనుంది. మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జన్మించిన ఈ చిన్నపట్టణాన్ని ‘అమృత్’ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతరత్న కలాం ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ మేరకు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్టప్రతి కలాంకు ఘన నివాళులర్పించారు.