-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 27: మధ్యప్రదేశ్లో దళిత మహిళలపై దాడి అంశం బుధవారం రాజ్యసభలో గందరగోళానికి దారి తీసింది. దళితుల అంశంపై చర్చ సందర్భంగా మధ్యప్రదేశ్లో గోరక్ష పేరిట ఇద్దరు ముస్లిం మహిళలపై దాడి జరిగిన సంఘటనపై బిఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారు.
న్యూఢిల్లీ, జూలై 27: చైనా మరోసారి దురాక్రమణకు దిగింది. ఆ దేశ సైనిక బలగాలు ఇటీవల సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ)కు చెందిన సైనికులు ఆయుధాలతో పాటు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోకి ప్రవేశించారు.
న్యూఢిల్లీ, జూలై 27: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏన్నో ఆశలు పెట్టుకొన్న శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పట్లో సాధ్యంకాదని స్పష్టం చేసింది. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని తెలిపింది.
న్యూఢిల్లీ, జూలై 27: దేశ వ్యాప్తంగా ఒకే పన్నుల విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన వస్తు సేవల బిల్లు (జిఎస్టి) ఆమోదానికి కేంద్రం మరింతగా మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ అమలులోకి వచ్చే మొదటి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని నూటికి నూరు శాతం భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించింది.
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ మరోసారి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రశ్నించే గుణం ఉన్న వారి గొంతు నొక్కేస్తారని, తనను మోదీ చంపేస్తారని కేజ్రీ ఓ వీడియోలో పేర్కొన్నారు. పలు ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తున్నారని మోదీ రాజకీయాలే ఇందుకు కారణమన్నారు. ‘మోదీ నన్ను బతకనివ్వరు’ అంటూ ఆరోపించారు.
దిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం బుధవారం రాజ్యసభలో స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలకు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. వాస్తవానికి నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ రెండు రాష్ర్టాల్లోనూ ముందుగానే స్థానాలు పెంచాలని కోరుతున్నారు.
చెన్నై: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) మంగళవారం ప్రభుత్వ అధికారులతో చేపట్టిన చర్చలు విఫలమవ్వడంతో గతంలో సమ్మెకు పిలుపు ఇచ్చిన మాదిరిగానే శుక్రవారం (జులై 29న) ఒక్కరోజు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు యూనియన్ల ఫోరం వెల్లడించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కూడా జులై 29న సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
చెన్నై: దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రామేశ్వరంలో ఆయన శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ తదితరులు పాల్గొని దేశానికి కలాం చేసిన సేవలను గుర్తుచేశారు.
దిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ ముసుగులో దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయని రాజ్యసభలో బుధవారం బిఎస్పి సభ్యులు ఆరోపించారు. మధ్యప్రదేశ్లో గోమాంసం తీసుకువెళుతున్నారన్న నెపంతో ఇద్దరు దళిత మహిళలను గోసంరక్షణ కార్యకర్తలు చితకబాదడం దారుణమని బిఎస్పి ఎంపీలు అన్నారు. పోడియం వద్దకు వారు చేరుకుని ప్రధాని మోదీ దళిత వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు.
ముంబయి: మరఠ్వాడా ప్రాంతం నుంచి అదృశ్యమైన వందమంది ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరారని శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ మహారాష్ట్ర అసెంబ్లీలో పేర్కొన్నారు. ఐసిస్కు హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తున్నందున ఆ పార్టీని దేశంలో రద్దు చేయాలన్నారు. ఉగ్రవాద సంస్థల్లో అమాయక ముస్లింలు చేరకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.