S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/24/2016 - 12:38

చెన్నై : అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం మూడోరోజైన అదివారం గాలింపు కొనసాగుతోంది. 5వేల కిలోమీటర్ల పరిధిలో గాలింపు కొనసాగిస్తున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది. అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టే అవకాశం 50 శాతమే ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇస్రో సయితం రంగంలోకి దిగింది. విమానం కూలిందని భావిస్తున్న ప్రాంతంలో సముద్రం లోతు మూడున్నర కిలోమీటర్లవరకు ఉంది.

07/24/2016 - 04:19

భద్రాచలం/చింతూరు, జూలై 23: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుంట డీఎస్పీ హరిశ్‌యాదవ్ నేతృత్వంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగరాజు పహాడ్ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

07/24/2016 - 03:32

వరంగల్, జూలై 23: హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ రైలులో చిన్నపిల్లల తరలింపు కలకలం రేపింది. శనివారం ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌లో ఒరిస్సా నుంచి 78 మంది చిన్నపిల్లలను తరలిస్తున్నారంటూ ఇక్కడికి సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకొనేలోపే సివిల్, జిఆర్‌పి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

07/24/2016 - 02:19

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 30లోగా తమతమ నల్లధన ఖాతాలను వెల్లడించాలని లేని పక్షంలో జైలు శిక్ష సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితిని గ్రహించి నల్లధన ఖాతాలు కలిగిన వ్యక్తులు ఎలాంటి గోప్యత లేకుండా వాటి వివరాలను వెల్లడించి ప్రశాంతంగా నిద్ర పోవాలన్నారు.

,
07/24/2016 - 01:59

చెన్నై, జూలై 23: బంగాళా ఖాతం మీదుగా ఎగురుతూండగా శుక్రవారం 29మందితో అదృశ్యమైన ఎఎన్ 32 వైమానిక దళ రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియలేదు. బయలు దేరిన కొద్ది నిముషాలకే రాడార్ నుంచి తప్పిపోయిన ఈ విమానం కోసం నలుదిశలా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ విమానం ఏమైంది.. కూలిపోయిందా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

07/24/2016 - 01:35

న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పారు. కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సుష్మ ‘ఎన్ని యుగాలైనా కాశ్మీర్ భారత్‌దే.. ఈ విషయంలో పాకిస్తాన్‌వి పగటి కలలే’నని అన్నారు. ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం అవుతుందంటూ నవాజ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ..

07/24/2016 - 01:32

కదిరి టౌన్/ ముదిగుబ్బ, జూలై 23: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టవేరా వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కర్నాటకకు చెందిన వీరంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ మృత్యువాత పడ్డారు.

,
07/24/2016 - 00:50

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శనివారం శ్రీకారం చుట్టింది. ‘27సాల్ యూపీ బేహాల్’ (27ఏళ్లలో ఉత్తర ప్రదేశ్ అస్తవ్యస్తం) అన్న నినాదంతో మూడు రోజుల బస్సు యాత్ర మొదలుపెట్టింది.

07/24/2016 - 00:44

న్యూఢిల్లీ, జూలై 23: తరాలు మారుతున్నా మాదిగల తలరాతలు మాత్రం మారడం లేదని మాదిగ రిటైర్డ్ ఉద్యోగుల విభాగం నాయకుడు బి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్పార్పీఎస్ చేప్పట్టిన నిరసన కార్యక్రమాలు శనివారం నాటికి ఐదోరోజుకు చేరాయి.

07/24/2016 - 00:43

రాజ్‌కోట్, జూలై 23: బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని, అది దళితులపై దాడులకు దిగుతున్న హిందూ ఫాసిస్టు శక్తులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు శనివారం ధ్వజమెత్తాయి. దళితులపై జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించాయి.

Pages