S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2016 - 15:05

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ సచివాలయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఆ భవనాన్ని బాంబు స్క్వాడ్‌తో విస్తృతంగా గాలించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఈ సందర్భంగా అనిరుధ్ ఘోష్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

07/04/2016 - 15:05

చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్‌కుమార్‌కు ఇక్కడి ఎగ్మూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన రామ్‌కుమార్ ప్రస్తుతం రాయ్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో ఆయన నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

07/04/2016 - 14:45

ముంబై: సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా 6వ సెషన్ లో కూడా దలాల్ స్ట్రీట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఐదు సెషన్లలో 747 పాయింట్లు లాభపడిన ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 27,315 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది.

07/04/2016 - 14:23

ఢిల్లీ: రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం భేటీ అయ్యారు. ఒలింపిక్స్లో రాణించాలని వారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

07/04/2016 - 12:27

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నట్టు భోగట్టా. ఈనెల 7న ప్రధాని మోదీ నాలుగు దేశాల్లో పర్యటించేందుకు వెళుతున్నందున ఈలోగా మంగళవారం నాడు క్యాబినెట్‌లో మార్పులు చేయనున్నారని సమాచారం.

07/04/2016 - 05:58

న్యూఢిల్లీ, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తితో సహా నైజీరియాలో కిడ్నాపైన ఇద్దరు భారతీయులను విడిపించేందుకు విదేశాంగశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.

07/04/2016 - 04:50

న్యూఢిల్లీ, జూలై 3: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు తమకు సరిపోవంటూ దేశవ్యాప్తంగా ఉన్న 33 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. 7 వేల రూపాయలుగా ఉన్న బేసిక్ వేతనాన్ని 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫార్ములా ప్రకారం వేతన సంఘంలో రూ. 18 వేలుగా నిర్ణయించారు.

,
07/04/2016 - 00:19

ఇండోర్, జూలై 3: ఇండోర్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. పనె్నండేళ్ల బాలుడికి మాయమైన ముక్కును కృత్రిమంగా సృష్టించి యథాస్థానంలో ఇంప్లాంట్ చేసి విజయం సాధించారు. ఉజ్జయిని పట్టణానికి చెందిన అరుణ్ పటేల్ (12) నెలరోజుల వయసులో ఉన్నప్పుడే ఇంజక్షన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్‌తో అతని ముక్కు దాదాపు మాయమైపోయిందని అతనికి సర్జరీ చేసిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అశ్విని దాష్ తెలిపారు.

07/04/2016 - 00:14

న్యూఢిల్లీ, జూలై 3: చరిత్రను మరిచిపోయేవారు చరిత్రను సృష్టించలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిక్కుల చివరి గురువు గురుగోవింద్ సింగ్ 350 జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకోసం వంద కోట్లు కేటాయిస్తామని మోదీ తెలిపారు. సిక్కు జనరల్ బాబా బందా సింగ్ 300 వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ సంస్మరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

,
07/04/2016 - 00:12

భువనేశ్వర్, జూలై 3: పూరీ జగన్నాథుడి వార్షిక రథయాత్ర కార్యక్రమం నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నాడు. పూరీ సముద్రతీరంలో మొత్తం వంద ఇసుక రథాలను రూపొందిస్తున్నారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలతో కలిసి మూడు అత్యున్నతమైన రథాలపై ప్రతి ఏటా తొమ్మిది రోజులపాటు ఊరేగడం తెలిసిందే.

Pages