-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
జైపూర్, జూన్ 27: భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె నుదుటిపై, చేతిపై పచ్చబొట్లు పొడిచాడు. వివాహ సమయంలో తనకు ఇస్తానన్న వరకట్నం రూ.51వేల రూపాయలు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో రేని గ్రామానికి చెందిన బాధితురాలు జగన్నాథ్ అనే వ్యక్తిని నిరుడు జనవరిలో వివాహం చేసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 27: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జిగా నియమితురాలైన వివాదాస్పద నేత ఆశాకుమారి తాను బాధ్యతల నుంచి తప్పుకునే ప్రశే్నలేదని సోమవారం స్పష్టం చేశారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఈ కాంగ్రెస్ నేత భూకబ్జా కేసులో ఏడాది జైలుశిక్ష పడి బెయిలుపై ఉన్నారన్న సంగతి తెలిసిందే. నేరచరితులకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించటంపై తీవ్ర దుమారం రేగుతోంది.
న్యూఢిల్లీ, జూన్ 27: అణు సరఫరాల గ్రూపు (ఎన్ఎస్జి)లో భారత్కు సభ్యత్వాన్ని కల్పించేందుకు అందులోని 48 సభ్య దేశాలతో కలసి తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని అమెరికా ఉద్ఘాటించింది.
న్యూఢిల్లీ, జూన్ 27: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే శాంతి చర్చలు సఫలం కావని పాకిస్తాన్ను ఉద్దేశించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పాకిస్తాన్తో భారతదేశం సత్సంబంధాలే కోరుకుంటోందన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ దేశంలో పర్యటించి, ఆ దేశ ప్రధానిని కూడా మన దేశానికి ఆహ్వానించారని వెంకయ్య గుర్తుచేశారు.
న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాలుగు అభ్యర్థులతో కేంద్రం జాబితాను ఖరారు చేసినట్టు తెలిసింది. సెప్టెంబర్లో రాజన్ పదవీకాలం ముగియనుంది. తాను మళ్లీ ఆర్బిఐ గవర్నర్ పదవి చేపట్టబోనని ఇటీవలే ఆయన ప్రకటించారు. అయితే ఆయననే కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
న్యూఢిల్లీ, జూన్ 27: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలయిన షీలా దీక్షిత్ వచ్చే సంవత్సరం జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీకి నేతృత్వం వహించడానికి విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఒక న్యూస్ చానల్ కథనం ప్రకారం..
న్యూఢిల్లీ, జూన్ 27: రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులు ఆయా పదవులకు ‘తగనివారు’ అని బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి చేసిన ఇటీవల విమర్శలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విభేదించారు. రఘురామ్ రాజన్కు దేశభక్తి లేదని స్వామి చేసిన వ్యాఖ్యలపై మోదీ సోమవారం స్పందిస్తూ, వ్యవస్థకు తాము అతీతులమని ఎవరు భావించినా తప్పే అవుతుందని స్పష్టం చేశారు.
దిల్లీ: ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్తో పాటు మరికొందరు ఆర్థిక నిపుణులపై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు స్పందించారు. స్వామి చేస్తున్న వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సోమవారం ప్రస్తావించగా ప్రధాని స్పందించారు. ‘సొంత పార్టీ వారైనా, ఇతర పార్టీల వారైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు..
లక్నో: తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న బుందేల్ఖండ్ ప్రాంతంలో వర్షం కురియాలని దేవుడ్ని ప్రార్థిస్తూ అంకితా బాజ్పాయ్ అనే 15 ఏళ్ల బాలిక 8 గంటల పాటు నిర్విరామ నృత్య ప్రదర్శన చేసింది. ఓ ఈతకొలనులో ఆమె ఈ సాహసం చేసి అందరి ప్రశంసలు అందుకుంది. నృత్య విన్యాసాలతో గతంలోనూ ఆమె పలు రికార్డులు సృష్టించింది. నీళ్లలో నృత్యం చేసేందుకు రోజూ 3 గంటల సేపు ప్రాక్టీస్ చేశానని ఆమె చెబుతోంది.
చెన్నై: ఇక్కడి సుగంబాకం రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకు సంబంధించి చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతిని సాధించలేక పోవడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సుగంబాకం రైల్వే స్టేషన్లో ఓ ఆగంతకుడు స్వాతిని వేట కొడవలితో నరికి చంపాడు.