-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
లక్నో, మే 17: సమాజ్వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ మంగళవారం తిరిగి ఆ పార్టీలో చేరారు. అమర్ సింగ్ పార్టీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని బట్టి ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు అర్థమవుతోంది. అయితే అమర్ సింగ్ పార్టీలో చేరడం సమాజ్వాది పార్టీలో ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశముంది.
న్యూఢిల్లీ, మే 17: రాష్ట్ర అధికారులు జారీచేసే వికలాంగుల సర్ట్ఫికెట్లు త్వరలోనే దేశమంతటా చెల్లుబాటవుతాయి. వికలాంగుల హక్కు బిల్లు-2014 ముసాయిదాలో ఈ మేరకు ఒక నిబంధనను చేర్చారు. సంప్రదింపులకోసం ఈ బిల్లును ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించారు. ‘కొత్త బిల్లులో ప్రభుత్వం ఒక నిబంధనను చేర్చింది.
న్యూఢిల్లీ, మే 17: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్పై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజన్ పరిపూర్ణుడైన భారతీయుడు కాదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్బిఐ గవర్నర్ పదని నుంచి ఆయనను తొలగించాలని మంగళవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి లేఖ రాశారు. రఘురాం రాజన్ దేశంలో గ్రీన్ కార్డుపై ఉన్నారు. కాబట్టి ఆయన పరిపూర్ణుడైన భారతీయుడుకాదు.
న్యూఢిల్లీ, మే 17: పరిహార కారణాలతో తాము ఇవ్వజూపిన ఉద్యోగాన్ని స్వీకరించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు)లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరుడు ఆసక్తితో లేడని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్లతో కూడిన హైకోర్టు ధర్మాసనానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని వివరించింది.
న్యూఢిల్లీ, మే 17: జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లను భారత్లో అంతర్భాగాలుగా చూపుతూ కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘్భగోళిక సమాచార క్రమబద్దీకరణ బిల్లు’పై పాకిస్తాన్ తీవ్రంగా అశ్యంతరం చెప్పింది. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ బిల్లులో జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లను తమ దేశ భూభాగాలుగా చూపించిందని..
న్యూఢిల్లీ, మే 17: ఫిబ్రవరి 9వ తేదీన ప్రతిష్ఠాత్మకమైన జవహర్లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకులు కన్హయ్యకుమార్ బృందం దేశ ద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవమేనని స్పష్టమైంది.
ప్రత్యేక ప్యాకేజీ అనేదేదీ అడగ లేదు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరాను.. ఇది వారి బాధ్యత. విభజన సమయంలో సమ న్యాయం చేసి ఉంటే తాను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ఇలా అడుక్కోవలసిన అవసరం ఉండేది కాదు.
న్యూఢిల్లీ,మే 17: రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఒక సీటును బిజెపికి కేటాయించే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లభించే మూడు రాజ్యసభ సీట్లలో నుండి ఒక సీటును బిజెపికి ఇస్తారా?
న్యూఢిల్లీ, మే 17: మెడికల్, డెంటల్ కాలేజిల్లో ప్రవేశాలకు ‘నీట్’ను ఏకైక ప్రవేశపరీక్షగా చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏడాదిపాటు వాయిదా వేయడానికి ఒక ఆర్డినెన్స్ను తీసుకు వచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలియజేశాయి. సుప్రీంకోర్టు తీర్పు అమలును 12 నెలల పాటు వాయిదా వేయడానికి ఆర్డినెన్స్ను తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.
దిల్లీ: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఇక్కడ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. విభజన చట్టం కింద కేటాయింపులు, రెవెన్యూలోటు భర్తీ, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నిధులు, రాష్ట్రంలో కరవు సాయం వంటి విషయాలను జైట్లీతో ప్రస్తావించారు.