S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/26/2016 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఇషత్ జహాన్ కేసు అఫిడవిట్‌పై ప్రభుత్వం అనవసర రాద్ధాంత చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం విమర్శించారు. సమస్యను తప్పుదోవపట్టించడంలో భాగంగానే ఇదం తా చేస్తోందని సోమవారం ఆయన ఆరోపించారు. జహాన్‌ది ఎన్‌కౌంటరా? కాదా అన్నదాన్ని పక్కన బెట్టి బురదజల్లే చర్యకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.‘కేసును నీరుగార్చడానికే ఇష్రాత్ జహాన్ అవిడవిట్ వివాదం సృష్టించారు.

04/26/2016 - 01:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సోమవారం వర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరో పిహెచ్‌డి విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 9న యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు ఇచ్చినందుకు ఉమర్ ఖలీద్‌ను ఒక సెమిస్టర్ పాటు విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు రూ. 20వేల జరిమానా విధించింది.

04/26/2016 - 01:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో అత్యధిక మలేరియా మరణాలు జీవించటానికి అనువుగా లేని పరిస్థితుల వల్లే జరుగుతున్నాయని ఎక్కువ మంది డాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. అంతర్జాతీయ మలేరియాదినం సందర్భంగా భారత్‌లో అతి పెద్ద డాక్లర్ల సమాజం ‘క్యూరోఫై’ నిర్వహించిన ఓ పోల్ సర్వేలో పాల్గొన్న డాక్టర్లలో 32శాతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

04/26/2016 - 01:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం మరో కేంద్ర పథకం పేరు మార్చాలని నిర్ణయించింది. ఇందిరా అవాస్ యోజన పథకం పేరు మార్పుచేశారు. ఇక నుంచి ఇందిరా అవాస్ యోజన పథకాన్ని ‘ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజన’పథకంతో పిలుస్తారు. అలాగే ఇళ్ల నిర్మాణ పథకానికి నిధులు పెంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

04/26/2016 - 01:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకుండా పారిపోయిన ‘కింగ్’్ఫషర్ కింగ్ విజయ్‌మాల్యా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సోమవారం విలువల కమిటీ సిఫారసు చేసింది. కరణ్‌సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ మాల్యాకు షోకాజ్ నోటీసు జారీ చేసిన వారం రోజుల తరువాత నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.

04/26/2016 - 01:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నీరు నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావల్సి అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి ఇండియన్ హేబిటేట్ సెంటర్‌లో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) హడ్కో 46వ్యవక స్థాపక దినోత్సవ వేడుకలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

04/25/2016 - 17:57

ముంబయి: తాను విమానంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి తన గొంతు నులిమి హతమార్చేందుకు ప్రయత్నించాడంటూ జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ముంబయి పోలీసులు అంటున్నారు. తనపై గుర్తుతెలియన వ్యక్తి దాడి చేయాలని చూసినట్లు కన్నయ్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాము క్షుణ్ణంగా విచారించగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ప్రకటించారు.

04/25/2016 - 17:57

ముంబయి: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో మొత్తం ఎనిమిదిమంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. నిందితులపై అభియోగాలను తొలగించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్టల్రోని మాలెగావ్ ప్రాంతంలో 2006 సెప్టెంబర్‌లో ముస్లింల శ్మశానవాటిక వద్ద బాంబులు పేలి 37 మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో 9 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు.

04/25/2016 - 17:56

కోల్‌కత: దాదాపు ఏడాదికాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఇక్కడి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు ఆత్మస్తానంద ఆరోగ్యం సోమవారం విషమించింది. ఈ విషయాన్ని రామకృష్ణ మిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఇటీవల ప్రధాని మోదీ పరామర్శించారు. రామకృష్ణ మిషన్, మఠం 15వ అధ్యక్షుడిగా ఆత్మస్తానంద బాధ్యతలు చేపట్టారు.

04/25/2016 - 17:56

చెన్నై: ఎండిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు వైగో సోమవారం నాడు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. నేడో, రేపో ఆయన నామినేషన్ వేస్తారని అంతా భావిస్తుండగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయన పోటీచేస్తారనుకున్న కోవిల్‌పట్టి స్థానం నుంచి ఎండిఎంకె అభ్యర్థిగా రమేష్ నామినేషన్ వేశారు.

Pages