S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/25/2016 - 08:02

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను అధిగమించేందుకు నీటిని ఆదా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టటాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.

04/25/2016 - 08:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇకపై ‘ప్రధాని’ పేరు లేదా జాతీయ నాయకుల పేర్లను పెట్టాలని కేంద్ర మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రాల్లో, జిల్లాల్లో కేంద్ర పథకాల అమలు, అవి విజయవంతమవుతున్న తీరు ప్రజలకు మరింత చేరువ కావటానికి తీసుకోవలసిన చర్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఒక మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

04/25/2016 - 06:30

దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కళ్లు చెమ్మగిల్లాయ. వివిధ కోణాల్లో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అర్థం చేసుకోకుండా విమర్శలు గుప్పిస్తోన్న వైనంపై జస్టిస్ టిఎస్ ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

04/25/2016 - 06:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కోర్టులపై భారం పెరిగిపోతున్నా.. కేసులు సంఖ్య అపరిమితంగా పేరుకు పోతున్నా న్యాయమూర్తుల సంఖ్యను పెంచకపోగా తమపై విమర్శలు గుప్పించడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ లా కమిషన్ సిఫార్సులు చేసి మూడు దశాబ్దాలు గడిచినా ప్రభుత్వం ఏమీ చేయక పోవడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

04/25/2016 - 06:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు పాత కోర్టులను ఆధునీకరించటంతోపాటు కొత్తగా మరో 79 కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ‘న్యాయమందించడంలో ఆలస్యం జరిగితే న్యాయం అందనట్లే’నన్న నానుడిని ఉటంకిస్తూ, ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

04/24/2016 - 17:43

న్యూదిల్లి:రాజధానిలోని పుతింపూర ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పదిహేను అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

04/24/2016 - 17:42

న్యూదిల్లి: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, నిధుల కొరత రానివ్వమని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ఆదివారంనాడు ఆమెతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయి రాష్ట్రంలో ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమాభారతి ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని, పోలవరం పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.

04/24/2016 - 17:09

న్యూదిల్లి:దేశంలో అవసరాలకు తగ్గట్లు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని, కేసుల పరిష్కారంలో బరువంతా న్యాయవ్యవస్థపై పడేయడం బాగోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ఠాకూర్ అన్నారు. రాజధానిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ప్రధాని పాల్గొన్న న్యాయసదస్సులో మాట్లాడిన ఠాకూర్ ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురైనారు. గద్గదస్వరంతో కొద్దిసేపు ప్రసంగించిన ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

04/24/2016 - 06:15

కోల్‌కతా/ శ్యామ్‌పూర్, ఏప్రిల్ 23: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో ఉమ్మడిగా పోటీచేస్తున్న సిపిఎం, కాంగ్రెస్ పాలక పక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకు పదునుపెట్టారు.

04/24/2016 - 06:13

పాట్నా, ఏప్రిల్ 23: బిజెపిని ఓడించడానికి పార్టీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక్కటి చేయడానికి ఒక ఉత్ప్రేరక పాత్రను పోషించడానికి తాను ప్రయత్నిస్తున్నాను తప్ప ఏ పదవినీ కోరుకోవడం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అయి తే ఒక వ్యక్తి ప్రధాని కావాలని రాసిపెట్టి ఉంటే అతను ఏదో ఒక రోజు ప్రధాని అయి తీరుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పదవినీ కోరుకోవడం లేదు.

Pages