-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చెన్నై: సినీనటి కుష్బూకు ఆశాభంగం తప్పలేదు. చెన్నైలోని మైలాపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావించినా కాంగ్రెస్ అధిష్ఠానం మొండిచెయ్యి చూపింది. డిఎంకెతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పటికీ తుది జాబితాలోనూ కుష్బూ పేరు లేదు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుతో కంగుతిన్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, బిజెపి అధినాయకత్వం శుక్రవారం హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊపిరి పీల్చుకున్నాయి.
ఉజ్జయిని, ఏప్రిల్ 22: ఉజ్జయినిలో శుక్రవారం ప్రారంభమైన సింహస్థ కుంభమేళా తొలి రోజున వేలాది మంది సాధువులు తమ శిష్యులతో కలిసి మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ షిప్రా నదిలో పవిత్ర స్నానాలు చేశారు.
ఇటానగర్, ఏప్రిల్ 22: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో ఎడతెగని వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు ఒక లేబర్ క్యాంప్పై విరిగిపడ్డంతో కనీసం 16 మంది సజీవ సమాధి అయ్యారు. తవాంగ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఫమ్లా గ్రామం వద్ద కన్స్ట్రక్షన్ పనులు చేసే కార్మికులు క్యాంప్లోపల నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సూరత్, ఏప్రిల్ 22: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు, ఆయన కుమారుడికి ఆదాయ పన్ను శాఖ 750 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆశారాం బాపు ఆశ్రమాలపై జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, ఇతర ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయని ఎసిపి ముఖేష్ పటేల్ వెల్లడించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయలున్న 42 బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: మానవ మనుగడకు అవసరమైన అన్నింటినీ ప్రసాదించిన భూమాతను పూజించాలని, భూమాత పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమాత ప్రాముఖ్యత గురించి మానవ జాతిని జాగృతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘ఎర్త్ డే’ను పాటిస్తున్న తరుణంలో ప్రధాని సామాజిక మాధ్యమం ట్విట్టర్లో ఈ పిలుపునిచ్చారు.
అగర్తల, ఏప్రిల్ 22: ఐసిస్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు జరపాలన్న పండిట్ రవిశంకర్ ప్రయత్నం ఎదురుతిరిగింది. శాంతి చర్చలు ప్రతిపాదించిన రవిశంకర్కు సమాధానంగా ఐసిస్ ఉగ్రవాదులు ఏకంగా తలలేని మొండెం ఫొటోను పంపించారు. ఈ విషయాన్ని అగర్తలాలో రవిశంకర్ స్వయంగా వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సమావేశం అవుతున్నారు.
చెన్నై/ తిరువనంతపురం, ఏప్రిల్ 22: ఎన్నికల సంఘం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీ చేసింది. దీంతో మే 16న జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాలలో, కేరళలోని 140 నియోజకవర్గాలలో, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 29.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత్-పాకిస్తాన్ మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త భారత్-పాకిస్తాన్ చర్చలపై ఇటీవల ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత్ ఈ వివరణ ఇచ్చింది. ‘పాకిస్తాన్తో చర్చల ప్రక్రియను నిలిపివేయలేదు.