S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/22/2016 - 08:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ‘ఉత్తరాఖండ్’ తీర్పుపై భారతీయ జనతాపార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటంతో పాటు, రాష్టప్రతి పాలన విధింపుపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఆందోళన చెందింది. హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని పార్టీ గురువారం పొద్దుపోయాక నిర్ణయం తీసుకుంది.

04/22/2016 - 05:47

నాసిక్, ఏప్రిల్ 21: ఎట్టకేలకు త్ర యంబకేశ్వర్ ఆలయంలో గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఆలయ ప్రవేశం చేసిన మహిళలు దేవతామూర్తికి పూజలు నిర్వహించారు. పోలీసులు రక్షణలో దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం వస్తధ్రారణ లేదంటూ కొందరు వ్యక్తులు మహిళలు గుడిలోకి కాకుండా అడ్డుకోవడమే కాకుండా దాడికి దిగిన సంగతి తెలిసిందే.

04/22/2016 - 05:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఐఏఎస్, ఐపిఎస్ తదితర సివిల్ సర్వీస్ అధికారులు దేశాభివృద్ధికి పునరంకితం కావటం ద్వారా తమ పాత్రకు కొత్త నిర్వచనం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ఎవరికి వారుగా కాక ఒక టీమ్‌గా పని చేయాలని, మార్పునకు ప్రతీకలుగా నిలవాలని ఆయన సూచించారు.

04/22/2016 - 05:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందేనని భారత్ ఉద్ఘాటించింది. చైనాలో ఐదు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికే పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అంటూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. తన చైనా పర్యటన వివరాలను ఆయన వివరించారు.

04/22/2016 - 05:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను తోసిపుచ్చుతూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురువారం భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కినందుకు, రాజ్యాంగాన్ని ఖూనీ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిం ది.

04/22/2016 - 05:39

కోల్‌కతా, ఏప్రిల్ 21: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో భాగంగా గురువారం నాలుగు జిల్లాల్లోని 62 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 79.22 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోయారు.

04/22/2016 - 05:37

కోల్‌కతా, ఏప్రిల్ 21: పున్నమి రోజున చంద్రుడు నిండుగా కనిపించడం సహజం. అయితే శుక్రవారం పున్నమి రోజున మాత్రం చంద్రుడు కాస్త చిన్నబోనున్నాడు.‘మినీ మూన్’గా శాస్తజ్ఞ్రులు అభివర్ణించే ఈ సంఘటన మరో 15 ఏళ్లకోసారి మాత్రమే సంభవిస్తుంది.

04/22/2016 - 05:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు శిక్షకు గురయ్యే రోజులు రాబోతున్నాయి. అవును, మైనారిటీ తీరని పిల్లలు నడుపుతున్న వాహనాలు రోడ్డు ప్రమాదాలకు కారణమైన సంఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులను బాధ్యులను చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

04/22/2016 - 05:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రభుత్వం జనాభా విధానంలో మార్పు తేవాలని, ఇద్దరు పిల్లల నిబంధనను అన్ని మతాల ప్రజలకు తప్పనిసరి చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. భారత్ ఇలా చేయడంలో విఫలమైతే, ‘కుమార్తెలు క్షేమంగా ఉండలేరు. పాకిస్తాన్‌లో వలె ముఖాలపై ముసుగులు ధరించుకోవలసి వస్తుంది’ అని మంత్రి వ్యాఖ్యానించినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.

04/22/2016 - 05:33

డెహ్రడూన్, ఏప్రిల్ 21: పోలీసు అశ్వం ‘శక్తిమాన్’ మరణానికి కారణమైన బిజెపి ఎమ్మెల్యే గణేష్ జోషీని వదిలేదని లేదని డెహ్రడూన్ ఎస్‌ఎస్‌పి సదానంద్ డేట్ వెల్లడించారు. ఎమ్మెల్యేపై కేసు కొననాగుతుందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. మార్చి 14న బిజెపి చేట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసు గుర్రం శక్తిమాన్ కాలుపై ఎమ్మెల్యే విచక్షణారహితంగా దాడి చేశారు.

Pages