S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2016 - 14:54

నాసిక్ (మహారాష్ట్ర): నాసిక్‌లోని అత్యంత ప్రాచీనమైన త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి గురువారం ఉదయం మహిళలు ప్రవేశించి పూజలు చేశారు. ఆలయాల్లోకి మహిళలను అడ్డుకోరాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో త్రయంబకేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు పాత నిబంధనలను సడలించింది. ఉదయం 6 నుంచి ఒక గంటసేపు తడి దుస్తులతో వచ్చి మహిళలను గర్భగుడిలోకి రావచ్చని ఆంక్షలను సడలించారు.

04/21/2016 - 14:54

కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షకులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. కోయంబత్తూరులో గురువారం ఉదయం 1.34 కోట్ల నగదును పట్టుకున్నారు. కర్నాటక నుంచి కారులో ఈ నగదును తెస్తున్నట్లు కనుగొని, ఇద్దరిని అరెస్టు చేశారు.

04/21/2016 - 12:20

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని కుప్పారా జిల్లాలో గురువారం ఉదయం భద్రతాదళాలకు, విద్రోహ శక్తులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడని భద్రతాసిబ్బంది తెలిపారు.

04/21/2016 - 12:16

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి గురువారం జరుగుతున్న మూడో విడత పోలింగ్‌లో హింస చోటుచేసుకుంది. బుర్ద్వాన్ జిల్లా కేటుగ్రామ్‌లో పోలింగ్ బూత్ వద్ద ప్రత్యర్థులు నాటు బాంబు విసరగా ఓ సిపిఎం కార్యకర్త మృతిచెందాడు. గాయపడ్డ ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడో విడతలో 62 నియోజవర్గాల్లో 16వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

04/21/2016 - 10:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: శ్రీనగర్ నిట్ విద్యార్థులు డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటుతోపాటు జాతీయ పండుగలు నిర్వహించాలన్న డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. ఇటీవల నిట్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా బుధవారం ఇక్కడ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

04/21/2016 - 10:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: 2020 నాటికి కుష్టురహిత ప్రపంచం లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని బుధవారం విడుదల చేసింది. డబ్ల్యు హెచ్‌ఓ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు ఎంతో ముఖ్యమైంది.

04/21/2016 - 10:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా నెలకొన్న కరవుపై చర్చించడానికి కేంద్రం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరవుప్రాంతాల్లోని మహిళలు, వృద్ధులు, పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలన్నారు. అలాగే రైతు కూలీలకు మూడు వేల రూపాయిల మేర కరవుపెన్షన్ ఇవ్వాలని బుధవారం ఇక్కడ కోరారు.

04/21/2016 - 09:52

అవును.. నేనే..! మేడమ్ టుసాడ్స్ బృందం తయారు చేసిన తన మైనం ప్రతిమను చూసి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. ఎవరు మోదీయో పోల్చుకోలేనంతగా నిజరూప సారూప్యత కలిగిన ఈ మైనం బొమ్మను 28న లండన్‌కు తరలిస్తారు. కళాకారుల నాలుగు నెలల కృషి ఫలితమే ఈ మైనం ఆకృతి.

04/21/2016 - 09:36

హైదరాబాద్, ఏప్రిల్ 20: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఐదువేల జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయమూర్తులను సకాలంలో నియమించకపోవడం కూడా ప్రజల ప్రాథమిక హక్కులను భంగపరిచినట్లేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనార్హం. సబార్డినేట్ కోర్టుల్లో 20214 మంది జడ్జిలు అవసరం కాగా, 4,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 23 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

04/21/2016 - 09:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణమంటే చెప్పలేని ఆనందం. అలాంటిది రైలు సముద్ర గర్భంలోంచి వెళ్తుదంటే ఆ థ్రిల్లే వేరు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ కోసం ఏర్పాటు చేస్తున్న హైస్పీడ్ కారిడార్‌లో 21 కిలోమీటర్ల మేర సముద్రం కింద నుంచి టనె్నల్‌కు ప్లాన్ చేశారు. ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు ఉంటుంది.

Pages