S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/18/2016 - 13:06

దిల్లీ: దిల్లీకి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మకు స్థానిక పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్ద ఇటీవల విద్యార్థులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగినపుడు ఓ సిపిఐ కార్యకర్తను కొట్టినట్లు శర్మపై కేసు దాఖలైంది. సమన్లు తీసుకున్న తర్వాత శర్మ మీడియాతో మాట్లాడుతూ, తాను కోర్టుకు సహకరిస్తానని చెప్పారు.

02/18/2016 - 13:04

దిల్లీ: దక్షిణ దిల్లీలోని డిఫెన్స్ కాలనీ సమీపంలోని మురికివాడల్లో గురువారం ఉదయం భారీగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు.

02/18/2016 - 07:42

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యు వర్శిటీ గొడవలపై చర్చ జరగాలన్న కాంగ్రెస్ సూచనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. పార్లమెంటులో చర్చలు వాడిగా వేడిగా జరిగినా ఫరవాలేదుకానీ, స్థాయికి తగ్గిన విమర్శలు చేయకూడదని సూచించారు.

02/18/2016 - 07:38

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ గురుత్వాకర్షక సిద్ధాంతం రుజువైన నేపథ్యంలో ఆ దిశగా భారత్ కూడా మరో అడుగు ముందుకు వేసింది. అమెరికాలోని లీగో లేబొరేటరీతో కలిసి అత్యాధునిక రీతిలో గురుత్వాకర్షక తరంగాల అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.

02/18/2016 - 07:04

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాకపోచ్చునని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం 2019 వరకు ఉన్నందున అప్పటిలోగా సీట్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చునని ఎన్‌డిఏ ప్రభుత్వం భావిస్తోంది.

02/18/2016 - 05:50

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను బుధవారం పాటియాలా కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు కన్హయను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

02/18/2016 - 07:44

న్యూఢిల్లీ: కేంద్ర పథకం అమృత్ కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 45 నగరాల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 37వేల 58 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రం అందరికీ ఇళ్లు పథకం కింద మంజూరు చేసిన 4లక్షల 75వేల ఇళ్లలో దాదాపు సగభాగాన్ని తెలుగు రాష్ట్రాలకే కేటాయించినట్టు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

02/18/2016 - 03:55

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను తొలగించాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం సిఫార్సు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్‌ను నియంత్రించలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్‌పై చర్చించారు. అనంతరం రాష్టప్రతి పాలనను తొలగించాలంటూ సిఫార్సు చేశారు.

02/17/2016 - 17:57

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక వ్యాఖ్యలేవీ తాను చేయలేదని, కొందరు వ్యక్తులు చేసిన నినాదాలు దురదృష్టకరమని జాతివ్యతిరేక వ్యాఖ్యల కేసులో నిందితుడు కన్నయ్యకుమార్ పేర్కొన్నాడు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కన్నయ్య కోర్టుకు వచ్చినపుడు రెండోసారి దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడికి పాల్పడిన న్యాయవాదిని గుర్తించిన కన్నయ్య జెఎన్‌యులో జరిగిన వివాదంపై వ్యాఖ్యానించాడు.

02/17/2016 - 17:06

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పాటియాలా కోర్టువద్దకు బుధవారం వచ్చిన కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడిచేశారు.

Pages