S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/16/2016 - 01:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: తమ హక్కుల సాధన కోసం నాలుగు ప్రధాన డిమాండ్‌లతో అంగన్‌వాడి వర్కర్లు, వామపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త అంగన్‌వాడి ఉద్యోగుల ఫెడరేషన్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనాన్ని పెంచాలని, వచ్చే బడ్జెట్‌లో అంగన్‌వాడిలకు నిధులను కేటాయించాలని, పదవీ విరమణ పొందిన వర్కర్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

02/16/2016 - 01:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ఏటువంటి చర్యలు తీసుకోన్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదేశించింది.

02/16/2016 - 00:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ ద్రోహ కేసును ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ను సోమవారం ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టుకు హాజరు పరిచిన సందర్భంగా తీవ్ర స్థాయిలో ఘర్షణలు, హింస చోటుచేసుకున్నాయి. కొందరు లాయర్లు పాత్రికేయులు, విద్యార్థులు, టీచర్లపై దాడులకు దిగారు. కోర్టు ఆవరణలోనూ, బయటా కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీరిని జాతి వ్యతిరేక శక్తులుగా పేర్కొంటూ నినాదాలు చేశారు.

02/16/2016 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ప్రభుత్వం కరవు పరిహారం కింద రాష్ట్రానికి మరో 280 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం జరిగిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహెర్శీతోపాటు హోం, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నతస్థాయి సమావేశానికి హాజరయ్యారు.

02/15/2016 - 19:18

న్యూదిల్లి:దేశంలో స్వచ్ఛనగరాల జాబితాలో మరోసారి మైసూరు అగ్రస్థానం సాధించింది. స్వచ్ఛ్భారత్ అమలు తరువాత దేశంలో స్వచ్ఛ నగరాలపై కేంద్రం సర్వే నిర్వహించి జాబితాను వెల్లడించింది. మైసూరు, చండీగఢ్, తిరుచిరాపల్లి తొలి మూడు స్థానాల్లో ఉండగా దేశ రాజధాని దిల్లీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం టాప్‌టెన్ నగరాల్లో ఒకటిగా నిలిచింది.

02/15/2016 - 18:03

హైదరాబాద్:సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడటంతో మరణించిన వీరజవాను ముస్తాక్ అహ్మద్ మృతదేహం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఆర్మీ, పోలీసు అధికారులు అతడికి నివాళి అర్పించారు. మరికొద్దిసేపటిలో మృతదేహాన్ని కర్నూలు జిల్లా నంద్యాల పరిథిలోని అతడి స్వగ్రామానికి తరలిస్తారు. మంగళవారంనాడు అంత్య్రక్రియలు నిర్వహిస్తారు.

02/15/2016 - 16:32

న్యూదిల్లి : ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని 2.5 లక్షలనుంచి రూ. 4 లక్షలకు పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది. అసోచామ్ ఆధ్వర్యంలో ఇటీవల దేశంలోని ప్రధాన నగరాల్లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిపై ఉద్యోగుల అభిప్రాయాలపై సర్వే జరిగింది. ప్రసుత పరిమితిని పెంచడం వల్ల పొదుపు, బీమా రంగాలకు మేలు జరుగుతుందని అసోచామ్ అభిప్రాయపడింది.

02/15/2016 - 15:05

న్యూదిల్లి:పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురుకు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న దేశద్రోహం కేసు విచారణకు వచ్చినపుడు కోర్టుకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందిపై దాడి జరిగింది. ‘లాంగ్‌లివ్ ఇండియా, డౌన్ జెఎన్‌యు’ నినాదాలు చేసిన న్యాయవాదులు విద్యార్థులను కోర్టు బయటకు నెట్టేశారు.

02/15/2016 - 14:55

న్యూదిల్లి:కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయినా వెళ్లేందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సి.ఎస్.కర్ణన్‌కు కేసులేవీ ఇవ్వద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. కాగా తాను షెడ్యూల్టు కులాలకు చెందినవాడినైనందునే వివక్ష చూపిస్తున్నారని, తన బదిలీపై పోరాడతానని ఆయన కర్ణన్ స్పష్టం చేశారు.

02/15/2016 - 14:54

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేకులకు మద్దతిస్తున్నవారితో కలసిమెలసి తిరుగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశభక్తికి సరికొత్త భాష్యం చెబుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. పార్లమెంట్‌పై దాడిచేసినవారి కీర్తిస్తూ, జాతివ్యతిరేక చర్యలకు పాల్పడినవారికి మద్దతివ్వడాన్ని ఏమనాలని అన్నారు. తన బ్లాగ్‌లో ఈ మేరకు షా వ్యాఖ్యలు చేశారు.

Pages