-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఘట్కేసర్ నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటిఎస్ సర్వీసును పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ రైల్వే బోర్డు చైర్మన్ ఏకె మిట్టల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుండి వరంగల్లోని కాజిపేట వరకు మూడో రైల్వేలైన్ వేయడం ద్వారా యాదాద్రికి ఎంఎంటిఎస్ సర్వీసు ఉపయోగించుకోవచ్చునని బూర నర్సయ్య గౌడ్ చైర్మన్కు తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉగ్రవాదంపై యుద్ధంలో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలనే దృఢ సంకల్పాన్ని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) శుక్రవారం వ్యక్తం చేశాయి. అన్ని దేశాలు రాజ్యేతర శక్తుల కార్యకలాపాలను నియంత్రించి తీరాలని, తమ గడ్డ మీదినుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలకు అన్ని రకాల మద్దతును ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి వారికి మినహాయింపునిస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వందేళ్ల క్రితం జర్మనీ సైద్ధాంతిక భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ వెలుగులోకి తెచ్చిన గురుత్వాకర్షక తరంగాలు నిజమేనన్న నిర్ధారణ.. భవిష్యత్లో ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది? ప్రపంచ వ్యాప్తంగా ఈ గురుత్వాకర్షక తరంగాల నిర్ధారణ ఈ శతాబ్దంలోనే చారిత్రక ఆవిష్కరణ అంటూ శాస్త్ర ప్రపంచం ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముంబయి, ఫిబ్రవరి 12: వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జిఎస్టి బిల్లు కు ఆమోదం లభిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బిల్లు ఆమోదానికి సహకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సియాచిన్ వీర జవాను హనుమంతప్పకు వేలాది మంది అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. సియాచిన్ మంచు చరియల్లో కూరుకుపోయి ఆరు రోజుల తరువాత ప్రాణాలతో బయటపడిన లాన్స్నాయక్ హనుమంతప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లాన్న్ నాయక్కు కర్నాటకలోని ధార్వాడ్ జిల్లా బెతాదూర్ గ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి.
రాయ్బరేలీ, ఫిబ్రవరి 12: పా ర్లమెంట్ ప్రతిష్ఠంభనపై తమ పార్టీని పదేపదే ప్రధాని మోదీ విమర్శించడాన్ని కాంగ్రె స్ అధినేత్రి సోనియా గాంధీ తిప్పికొట్టారు. పేదలు, సామాన్యులకు సంబంధించిన అంశాలను సభ లో లేవనెత్తిన ప్రతిసారీ తమ పార్టీ గొంతు నొక్కేందుకు ప్ర యత్నిస్తున్నారని అన్నారు.
ముంబయి, ఫిబ్రవరి 12: దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై 26/11 దాడి తరువాత కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదా భారత్పై దాడులకు కుట్ర పన్నింది. దీనిపై ఆల్ఖైదా తనతో సంప్రదింపులు జరిపినట్టు 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉగ్రవాది హెడ్లీ నుంచి ప్రత్యేక న్యాయమూర్తి జిఎ సనప్ వాంగ్మూలం నమోదు చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పాకిస్తాన్కు ఇవ్వాలని భావిస్తున్న 860మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయాలని భారత దేశం శుక్రవారం అమెరికాకు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ఆర్ఎస్ఎస్తో అనుసంధానమైన పాఠశాలలకు ప్రధా ని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని.. విద్యా నాణ్యతనూ పెంచుకోవాలని కోరారు.