-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభం నెలకొందని పేర్కొన్న ఆయన ప్రజా సంక్షేమం కోసమే తా ను పనిచేస్తున్నానన్న నమ్మకాన్ని ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన బా ధ్యత మోదీపై ఉంద్నారు. గోవధ, మత కలహాల వంటి సునిశిత అంశాలపై మోదీ మాట్లాడక పోవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసన ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి చేసిన కేసులో అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు)లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన కేసుకు సంబంధించి పోలీసులు జెఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయా కుమార్ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కన్హయా కుమార్ను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరకు కూడా రెక్కలొచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 850 పెరిగి రూ. 29,650కి చేరుకుంది. గత 11 రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న బంగారం ఈ 11 రోజుల్లోనే 2,600 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది వరసగా ఇన్ని రోజులు బంగారం ధర పెరగడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఏర్పాటు చేస్తున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రాన్ని 2021నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఇంధన మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శుక్రవారం సిఎం కెసిఆర్తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలు అమలుకు కేంద్రం చేపట్టిన ‘ఉదయ్’లో చేరేందుకు కెసిఆర్ అంగీకరించటం పట్ల గోయల్ సంతోషం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఎన్టీపీసీ చేపడుతున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రం శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి మొదటివారంలో తెలంగాణకు వస్తున్నారని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పూర్తికి 1.15 లక్షల కోట్లు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు.
దిల్లీ:హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఉపాధ్యక్షుడు రాహుల్కి వూరట లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన ధర్మాసనం సోనియా, రాహుల్ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
న్యూదిల్లి:కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయూష్గోయల్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీయూష్గోయల్ భేటి అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. అంతకుముందు ఆయన ప్రధాని మోదీతో సమావేశమై తెలంగాణకు రావలసిన నిధులు, పథకాలపై చర్చించారు.
డెహ్రడూన్: మే 11వ తేదీన ఉదయం 4:30గంటలకు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సీఈవో బీడీ సింగ్ తెలిపారు. గతేడాది నవంబర్ 17న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి మేలో తెరవనున్నారు. తెరవడానికి ముహూర్తాన్ని వసంత పంచమి సందర్భంగా ఈరోజు నిర్ణయించారు.
దిల్లీ: జవహర్లాల్ నేషనల్ యూనివర్సిటీలో వివాదం నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్ కన్హయ్యా కుమార్ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. పార్లమెంట్పై దాడి కేసులో అఫ్జల్గురు ఉరితీతకు వ్యతిరేకంగా ఇటీవల జేన్యూ విద్యార్థులు ఆందోళన చేశారు.