S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/22/2016 - 12:11

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీని వారణాసిలో కలిసేందుకు వికలాంగులు ఓ బస్సులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపక్క విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారణాసి పర్యటనలో మోదీని కలిసేందుకు వీరంతా బస్సులో బయలుదేరారు.

01/22/2016 - 12:10

ముంబై: రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై గురువారం అర్ధరాత్రి కారు దూసుకుపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కారును సంఘటన స్థలంలో వదిలేసి వెళ్లిన డ్రైవర్‌ను కొద్ది గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

01/22/2016 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణకు సంబంధించిన పలు పథకాలను రానున్న రైల్వే బడ్జెట్‌లో చేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఆనంద్ భాస్కర్ గురువారం సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. స్టేషన్ ఘనపుర్-సూర్యాపేట్ రైల్వే లైను నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలన్నారు.

01/22/2016 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 21: విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర పౌన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరారు. అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం రైల్ భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

01/22/2016 - 01:46

న్యూఢిల్లీ/అమృత్‌సర్, జనవరి 21: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కేసుకు సంబంధించి పంజాబ్ పోలీస్ ఎస్‌పి సల్వీందర్ సింగ్ నివాసాల్లో ఎన్‌ఐఏ గురువారం సోదాలు జరిపింది. ఐదుచోట్ల జరిపిన ఈ సోదాల్లో సల్వీందర్‌సింగ్, ఆయన స్నేహితులు, వంటమనిషి నివాసాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది.

01/22/2016 - 01:44

న్యూఢిల్లీ, జనవరి 21: అత్యహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్మృతీ ఇరానీ మూడు అబద్దాలు చెప్పారని అన్నారు.

01/22/2016 - 01:43

కోల్‌కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఇటీవల జరిగిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, రాష్ట్రంలో ‘మా- మాటి-మనుష్’ (తల్లి, మట్టి, ప్రజలు)కు భద్రతే లేదన్నారు. ఈ మఃడింటికి రక్షణ కల్పిస్తామన్న నినాదంతోనే తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

01/22/2016 - 01:42

న్యూఢిల్లీ, జనవరి 21: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఉత్పత్తి వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మొదలవుతుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.

01/22/2016 - 01:41

త్రిసూర్, జనవరి 21: సెక్యురిటీ గార్డు హత్యకేసులో కేరళకు చెందిన బీడీ వ్యాపారి మహ్మద్ నషామ్‌కు కోర్టు 39 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బీడీ బరాన్‌గా పిలిచే నషామ్ తన లగ్జరీకారుతో వాచ్‌మెన్‌ను ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. కేసుసు విచారించిన మొదటి అదనపుజిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కెపి సుధీర్ 40 ఏళ్ల బీడీ బరాన్‌కు ఏకంగా 39 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

01/22/2016 - 02:35

అహ్మదాబాద్, జనవరి 21: ప్రసిద్ధ శాస్ర్తియ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్ (97) గురువారం ఉదయం కన్నుమూశారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సతీమణే మృణాళిని. వయోభారంతో అస్వస్థతకు గురైన మృణాళిని బుధవారం నగరంలోని ఓ ఆసుప్రతిలో చేరారు. ఆసుపత్రిలోనే గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Pages