-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జనవరి 19: సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి వీలుగా దేశ ప్రజల్లో లౌకిక భావనలను మరింతగా శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం నాడిక్కడ ఉన్నత విద్యా సంస్థలు, సివిల్ సర్వీస్ సంస్థలను ఉద్దేశించి మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ దేశ యువతకు విలువ ఆధారిత విద్యను అందించడం ఎంతో అవసరమన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 19:పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడికి దారితీసిన పరిణామాలను శోధిస్తున్న ఎన్ఐఎ మంగళవారం సీనియర్ పోలీసు అధికారి సల్వీందర్ సింగ్పై నేర నిర్థారణ పరీక్ష జరిపింది. గత ఐదు రోజులుగా సల్వీందర్ సింగ్ను విచారిస్తున్నప్పటికీ ఆయన వెల్లడించిన వివరాల్లో పొంతన లేకపోవడం వల్ల ఈ పరీక్ష జరిపినట్టు అధికారులు తెలిపారు.
పనాజీ, జనవరి 19:గణతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్లను చంపేస్తామంటూ ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ (ఐఎస్ఐఎస్) సంతకంతో ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖను అందుకున్న గోవా పోలీసులు దాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు. దీనిపై తపుపరి దర్యాప్తు బాధ్యతను ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ (ఎటిఎస్)కు అప్పగించారు.
రైసిన్ : మధ్యప్రదేశ్లోని రైసిన్ జిల్లాలో భోజ్పురి ఆలయానికి సమీపంలో ఓ ఇంట్లో పని చేస్తున్న దౌలత్ సింగ్ భీల్(40) అనే వ్యక్తి తన యజమాని ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను దగ్గర ఉన్న అడవికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేసి శవాన్ని అక్కడే ఆకులు, రాళ్ల మధ్య పాతిపెట్టి వెళ్లిపోయాడు
పనాజీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్పారికర్లను చంపుతామంటూ గోవా రాష్ట్ర సెక్రటేరియట్కు బెదిరింపు లేఖ వచ్చింది. పోస్టు కార్డు మీద రాసిన ఈ లేఖలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ :పంజాబ్ పఠాన్కోట వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఎస్పీ సల్వీందర్ సింగ్కు జాతీయ దర్యాప్తుసంస్థ అధికారులు లైటిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ను అనుమానితునిగా భావించి అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
న్యూఢిల్లీ :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హెచ్సీయూలో ఉద్రిక్తత కొనసాగుతుండగా, ముంబయి యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పూణెలోని ఎఫ్టిఐఐ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. కేంద్ర మంత్రి స్మృతీఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోక్రాజార్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తున్నారు. కోక్రాజార్ జిల్లాలో ఆయన బహిరంగసభలో పాల్గొన్నారు. అభివృద్ధి మంత్రమే తమ ఎజెండా అన్నారు. వచ్చే ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కోక్రాజార్ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు.
దిల్లీ: ఈ నెల 26న ఇక్కడ జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే రిపబ్లిక్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నందున ఐసిస్ తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
న్యూఢిల్లీ, జనవరి 18: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. పార్టీ హైకమాండ్ నిర్ణయించిన వెంటనే అధ్యక్ష పదవి చేపడతానని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ సోమవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విలేఖరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, అధినాయకత్వం ఈమేరకు నిర్ణయం తీసుకోవటమే ఆలస్యమని ప్రకటించారు.