S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/13/2016 - 18:19

పాట్నా ‌: బస్సు లోయలో పడడంతో ఐదుగురు మృతిచెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడిన ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి రాట్‌బాగ్‌ గ్రామంలోని లోయలో పడిపోయింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందంటూ స్థానికులు బస్సును బయటికి తీసి నిప్పుపెట్టి రోడ్డుపైనే బైఠాయించారు.

01/13/2016 - 18:17

న్యూఢిల్లీ : ఉత్తర కామెరూన్‌లోని కుయేప్‌ మసీదులో బుధవారం పేలుడు చోటుచేసుకుంది. ఉదయం ప్రార్థన సమయంలో పేలుడు జరగడంతో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బోకోహరం ఉగ్రవాదులు దాడికి పాల్పడుతుంటారని అధికారులు తెలిపారు.

01/13/2016 - 15:58

న్యూఢిల్లీ : ఆధ్యాత్మిక గురువు, డేరా అధినేత గుర్‌మీత్‌ రాం రహీం సింగ్‌ను అనుకరించి ఆయన అనుచరుల మనోభావాలను గాయపరిచినందుకు కమెడియన్‌ కీకు శార్దా(పలక్‌) అరెస్ట్‌ అయ్యారు. టెలివిజన్‌లో ప్రసారమయ్యే ప్రఖ్యాత హిందీ కామెడీ నైట్స్‌ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు, మనోభావాలను గాయపరిచినందుకు శార్దాని ఇప్పుడు అరెస్టు చేశారు.

01/13/2016 - 15:56

న్యూఢిల్లీ :మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌ జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోడీ వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తద్వారా 1994లో జిగి ఫెర్నాండెజ్‌, నటాషా జెరెవా వరుసగా 28 విజయాలతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది.

01/13/2016 - 15:46

న్యూఢిల్లీ : తెలంగాణకు కరువు సాయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చర్చించారు. వీరిద్దరి మధ్య చర్చ ముగిసిన అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రూ. 1500 కోట్ల సాయాన్ని కోరామని తెలిపారు. జాతీయ డెయిరీ పథకం కింద ఇవ్వాల్సిన రూ. 1,024 కోట్లను అడిగామన్నారు.

01/13/2016 - 13:55

న్యూఢిల్లీ : పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో భద్రతా దళాల మధ్య సమన్వయం లోపించలేదని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్ అన్నారు. దళాల మధ్య సంపూర్ణ సమన్వయంతోనే పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను తుద ముట్టించామన్నారు. ఆపరేషన్ మూడు రోజులు కొనసాగించడంపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. జవాన్ల భద్రతకు సంబంధించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.

01/13/2016 - 13:32

న్యూఢిల్లీ : మ్యాగీ న్యూడిల్స్‌పై సుప్రీం కోర్టులో బుధవారంనాడు విచారణ జరిగింది. మ్యాగీపై ముంబయి హైకోర్టు నిషేధం ఎత్తివేయటంతో భారత ఆహార భద్రతా సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ న్యూడిల్స్‌ను యువత, పిల్లలు ఎక్కువగా తింటున్నందున వీరి ఆరోగ్య భద్రతపై తమకు బాధ్యత ఉందని పేర్కొంటూ మరిన్ని శాంపిల్స్‌ను మైసూర్ ప్రయోగశాలలో పరీక్షించవలసిందిగా సూచించింది.

01/13/2016 - 07:26

తిరువనంతపురం, జనవరి 12: రుతుస్రావ వయసులో ఉన్న యువతులు, మహిళలను శబరిమలలోని చారిత్రాత్మక అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించనీయకపోవడం అక్కడి కట్టుబాట్లలో భాగమేనని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) పేర్కొంది.

01/13/2016 - 07:25

రాయ్‌పూర్, జనవరి 12: పరస్పర సంప్రదాయాలు, మనోభావాలను గౌరవించుకున్నప్పుడే శాంతి, సమైక్యత, సామరస్యం పెంపొందుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ రకమైన పరిస్థితి ఏమాత్రం కొరవడినా అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించారు. వైవిధ్యమే భారతదేశ అంతర్గత శక్తి అని, సామరస్యం దీన్ని మరింత బలోపేతం చేసే సుగుణమని ప్రధాని తెలిపారు.

01/13/2016 - 07:23

న్యూఢిల్లీ / ఇస్లామాబాద్, జనవరి 12: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి భారత్‌పై నిప్పులు చెరిగారు. పఠాన్‌కోట్ దాడికి కుట్రపన్నిన వారిపై ప్రధాని నవాజ్ షరీఫ్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మళ్లీ విషం కక్కారు.

Pages