S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/16/2015 - 07:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం కూడా లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గొడవచేసిన అనంతరం జీరో అవర్‌లో కొద్దిసేపు నినాదాలిచ్చి సభనుండి వాకౌట్ చేశారు. అనంతరం లోక్‌సభ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది.

12/16/2015 - 07:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మన్మోహన్ సింగ్ స్థానే ప్రణబ్ ముఖర్జీని 2004లో ప్రధాన మంత్రిని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి తప్పి ఉండేదని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాలు భిన్నంగా ఉండేవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు.

12/16/2015 - 07:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం మరోసారి అసభ్యకరమైన పదజాలంతో ప్రధాని మోదీని విమర్శించి సరికొత్త వివాదానికి తెరతీశారు. తన కార్యాలయం, ముఖ్య కార్యదర్శి నివాస గృహంపై సిబిఐ సోదాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని పిరికిపంద అని, సైకో అని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఘాటుగా స్పందించింది.

12/16/2015 - 07:50

ఇటార్సి, డిసెంబర్ 15: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో మంగళవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు వంతెనపైనుంచి నదిలో పడిపోవడంతో ఏడుగురు మహిళలు సహా 15 మంది చనిపోగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఇండోర్ నుంచి పరాసియా వెళ్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు సోహగ్‌పూర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.

12/16/2015 - 07:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగించటానికి కావలసిన చర్యలు తీసుకోవలసిందిగా నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు ఒక వినతి పత్రం అందచేశారు. వర్గీకరణ జరిగి నాలుగేళ్లు అమలు జరిగిందని ఆయన తెలిపారు. 2004లో సుప్రీమ్ కోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించినందున ఆగిపోయిందిన ఆయన చెప్పారు.

12/16/2015 - 07:08

న్యూఢిల్లీ,డిసెంబర్ 15:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్డూ సర్క్యులర్ రైల్వే సదుపాయాన్ని కల్పించవలసిందిగా గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. అమరావతిని చేరుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరంపై ఆయన వివరించారు.

12/16/2015 - 06:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: విజయవాడలో వేళ్లూనుకున్న కాల్‌మనీ రక్కసికి చిక్కిన మహిళలను రక్షించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జాతీయ మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

12/16/2015 - 06:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆర్థిక సంస్కరణల్లో అత్యంత కీలకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు గులాం నబఈ ఆజాద్, ఆనంద్ శర్మలతో ఈ బిల్లుపై జరిపిన చర్చలు అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే.

12/16/2015 - 06:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: తెలంగాణ కాంగ్రెస్‌కు కార్యవర్గం ఏర్పాటుపై బేధాదాభిప్రాయాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మంగళవారం తెలంగాణ నేతలతో పార్లమెంట్ ఆవరణలో జరిగిన చర్చల్లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి.

12/16/2015 - 06:13

కొల్ల్లాం (కేరళ), డిసెంబర్ 15: నిరంతరం రాద్ధాంతం సృష్టిస్తూ పార్లమెంట్‌ను కొనసాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడంగా ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ దిగమింగుకోలేక పోతోందని అన్నారు.

Pages