S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/16/2015 - 06:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ గుప్తా కార్యాలయంలో సోమవారం సిబిఐ జరిపిన దాడులు కలకలం సృష్టించాయి. కుమార్ గుప్తాకు సంబంధించిన 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ సచివాలయంలోని మూడో అంతస్తులో సిబిఐ దాడులు నిర్వహించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు.

12/16/2015 - 05:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 46 పైసలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పదకొండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను తగ్గించాయి. నవంబర్ 16న పెట్రో ధరలను పెంచిన కంపెనీలు, అదే నెల 31వ తేదీన ధరలను తగ్గించాయి.

12/16/2015 - 05:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి త్వరలోనే కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం తదితరులతో చర్చలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా కార్యవర్గం ఉంటుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.

12/15/2015 - 16:35

న్యూఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించటంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తంచేస్తూ పోడియంను చుట్టముట్టారు. కాంగ్రెస్ సభ్యులు ఎంతకీ ఆందోళన విరమించకపోవటంతో రాజ్యసభ చైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు.

12/15/2015 - 16:31

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలోనూ, సీఎం ముఖ్యకార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయంలో మంగళవారంనాడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి రాజేందర్ కుమార్‌పై నేరపూరిత అధికార దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. కాగా సీఎం కేజ్రీవాల్ ఆఫీసును సీబీఐ సీజ్ చేసింది.

12/15/2015 - 16:31

కోల్‌కతా : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఆయన కార్యాలయాన్ని సీజ్ చేయటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. సీబీఐ చర్యలు తనను షాక్‌కు గురిచేశాయని ఈమేరకు ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/15/2015 - 16:29

ఢిల్లీ : దేశరాజధాని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘం, తెలంగాణ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ధర్మాలు నిర్వహించారు. చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్. కృష్ణయ్య నాయకత్వం వహించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించింది.

12/15/2015 - 14:15

ముంబయి : ముంబయిలో ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్‌, ఆమె న్యాయవాది హరీశ్‌ భంభానీల హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టైన వారిలో టెంపో డ్రైవర్‌ వికాస్‌, మరో ఇద్దరు మూడేళ్లుగా హేమా ఉపాధ్యాయ్‌కి చెందిన గిడ్డంగిలో పని చేసేవారే కావడం గమనార్హం.

12/15/2015 - 13:33

చెన్నై : వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ వెల్లడించారు. వరద బాధితులదరినీ ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అన్నారు.

12/15/2015 - 13:15

ఢిల్లీ : ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ప్రతి వివాదంలో ప్రధానిని లాగడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందన్నారు. సీబీఐ... ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదని స్పష్టం చేశారు.

Pages