S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2015 - 18:35

చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 'ది హిందు' దిన పత్రిక 137 ఏళ్లలో తొలిసారి చెన్నైలో ప్రింటింగ్ నిలిపివేయగా.. పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ రెండు టీవీ ఛానళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడింది.

12/02/2015 - 18:21

చెన్నై: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తొలిసారి చెన్నై జూలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షాల వల్ల 40 ఏళ్ల క్రితం జూ చుట్టూ కట్టిన గోడ కూలింది. దీంతో జూ పార్క్ నుంచి మొసళ్లు బయటపడ్డాయన్న వదంతులు చెన్నై ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. అయితే ఆ వార్తలను మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్టు ఖండించింది. జూ నుంచి ఒక్క మొసలి కూడా బయటకు వెళ్లలేదని నిర్వహకులు స్పష్టం చేశారు.

12/02/2015 - 16:53

చెన్నై:చెన్నైకి సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జాతీయ విపత్తు సహాయక దళానికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) పది బృందాలను చెన్నైకి తరలించారు. ఆర్మీ, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక చెన్నై రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారి అనిల్ సక్సేనా తెలిపారు.

12/02/2015 - 16:48

చెన్నై : చెన్నై మహానగరం నిండుకుండను తలపిస్తున్నది. మొత్తం నగరమంతా నీటిలో ముగినిపోయింది. వరద ఉధృతికి సైదాపెట్‌ ఆనకట్టపైకి వరదనీరు చేరుకుంది. మోకాళ్లలోతు నీళ్ల చేరిన రోడ్లపై వాహనాలను నడుపలేక.. ఇళ్లకు చేరలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది.

12/02/2015 - 16:01

చెన్నై : తమిళనాడులోవరదలకు 197 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెలిఫోన్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంది.

12/02/2015 - 15:59

రాజస్థాన్‌ :రాజస్థాన్‌లోని కోటా, ధోల్‌పూర్‌, సవాయ్‌ మధోపూర్‌, భరత్‌పూర్‌ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో భరత్‌పూర్‌, ధోల్‌పూర్‌లలో పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

12/02/2015 - 15:57

చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 72 గంటల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎల్‌. ఎస్‌. రాథోడ్‌ తెలిపారు. 72 గంటల తర్వాత మరో వారం పాటు ఓ మోస్తరు వర్షం పడుతుందని పేర్కొన్నారు.

12/02/2015 - 14:04

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడిచిపెట్టే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు ఈరోజు స్పష్టం చేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం.. దోషులను విడుదల చేసే హక్కు రాష్ట్రాలకు లేదని న్యాయస్థానం ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌ దత్తు ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

12/02/2015 - 13:35

ఛత్తీస్ గఢ్ : కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనో ఓ జవాన్ మృతి చెందగా మరో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి.

12/02/2015 - 13:34

చెన్నై : తమిళనాడులో సహాయక చర్యలకు విశాఖ నుండి ఐఎన్ఎన్ ఐరావత్ బయలుదేరింది. బోట్లతో 20 మంది ఐరావత్ గజ ఈతగాళ్లు బయలుదేరారు. ఒడిశా నుండి చెన్నై కు 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.

Pages