-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశంలో రైల్వే వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. కాశ్మీర్లో సీఆర్పీఎప్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ గంభీరంగా ప్రసంగించారు. న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఈ రైలు తిరుగుతుందన్నారు. రైల్వే సేవలను ఆధునీకరించామన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ప్రభుత్వం 1993లో తెచ్చిన చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన ఒక తాజా పిటిషన్ను విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. ఈ చట్టం కిందనే అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం సహా 67.703 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది.
జైసల్మేర్, ఫిబ్రవరి 15: భారత్-పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత వైమానిక దళం శనివారం విన్యాసాలను ప్రదర్శించనుంది.
న్యూఢిల్లీ: పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దుశ్చర్యగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మాజీ ప్రధాని మన్నోహన్ సింగ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దారుణమైన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వనని అన్నారు. మనదేశం 40 జవాన్లను కోల్పోయిందని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి వారణాసికి గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు రైలులోని ప్రయాణీకులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ బోగీలు ఉన్నాయి. రైలులో 1128 మంది ప్రయాణీకులు కూర్చోవచ్చు. 753 కిలోమీటర్ల దూరం ప్రయాణం కేవలం 8 గంటల్లో చేయవచ్చు.
జమ్మూకాశ్మీర్: పూల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడిలో అమరులైన జవాన్లకు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారంనాడు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన జవాన్ల పార్థీవదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అంతేకాదు జవాన్ల శవపేటికలను భుజాలపై మోసి.. సైన్యం పట్ల తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.
న్యూఢిల్లీ: దాడికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. మేము మర్చిపోం.. క్షమించం. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని సీఆర్పీఎఫ్ స్పష్టంచేసింది. మరోవైపు ఈ దాడికి పాల్పడినవారిని తీవ్రంగా హెచ్చరించిన ప్రధాని మోదీ ఈమేరకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి చైనా అంగీకరించలేదు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని దేశాలు కలిసి రావాలి అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు. మరి మసూద్ అజర్పై తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా అని ప్రశ్నించగా..
న్యూఢిల్లీ: భారత్లో ఉగ్రదాడులకు ఊతం అందిస్తున్న పాకిస్థాన్ను ఒంటరిని చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్:పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్ అలియాస్ వకాస్ కాశ్మీర్కు చెందినవాడే. ఈ మేరకు జైషే మహ్మద్ సంస్థ విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ వకాస్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. దాడికి పాల్పడిన తరువాత వకాస్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు.