-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ: దేశ భద్రతా వ్యవహారాలపై కేంద్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీఆర్ఫీఎఫ్ డీజీ భట్నాగర్ పాల్గొన్నారు. కాగా పూల్వామాలో సంఘటనాస్థలానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బయలుదేరి వెళ్లారు.
న్యూఢిల్లీ: జమ్మూలో ఉగ్రవాదుల దుశ్చర్యను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. గాయపడిన ఉగ్రవాదులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని సాగించిన మారణకాండకు కారకులైనవారిపై ప్రతీకార చర్య తీసుకుంటామని అన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ముష్కరాలు దుశ్చర్యను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అందరం కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడదామని పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఈ ఘాతుకాన్ని ఖండిస్తూ జై షే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మసూర్ అజార్పై భారత్ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడుల్లో అమరులైన 40మంది వీర సైనిక జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. తన జీవితంలో ప్రతి క్షణం వీర సైనికుల త్యాగాలను గుర్తుకుతెచ్చుకుంటూనే ఉంటానని అన్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ఇచ్చామని, వారి ధైర్యసాహసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.
అజ్మీర్ (రాజస్థాన్): దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడమే పనిగా ఆరెస్సెస్ పనిచేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ సేవాదళ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల్లో పరస్పరం ప్రేమను పంచుకునే విధంగా కాంగ్రెస్కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి ద్వేషం విరుద్ధమని, భారతీయ సమాజంలో అసహనానికి తావులేదన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో కేంద్రప్రభుత్వం 5వేల సీట్లను పెంచింది. మొత్తం మీద 10 శాతం అదనపు సీట్లకు వీలు కల్పించింది. దీనివల్ల తెలంగాణలోని అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 10 శాతం సీట్లు అదనంగా పెరుగుతాయి. పెరిగిన సీట్లకు ఈ విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: భారత్, యూరోపియన్ యూనియన్ ఏడు పరిశోధన, నవీకరణ ప్రాజెక్టులపై సంయుక్తంగా 40 మిలియన్ యూరోల వరకు పెట్టుబడి పెట్టాలని గురువారం నిర్ణయించాయి. దేశంలో నీటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన గంగా రెజువనేషన్ ప్రాజెక్టు కూడా ఇందులో ఉంది.
డెహ్రాడూన్, ఫిబ్రవరి 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం డెహ్రాడూన్లోని జోలి గ్రాంట్ విమానాశ్రయంలో సుమారు నాలుగు గంటల సేపు ఉండిపోవాల్సి వచ్చింది. అననుకూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ టేకాఫ్ కాకపోవడం వల్ల ఆయన విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ప్రధానమంత్రి గురువారం ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండింది.
ముంబయి, ఫిబ్రవరి 14: విద్యుత్ వినియోగం, పర్యావరణ పరిరక్షణలో మనదేశం ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంటోంది. ‘లీడర్షిప్ ఇన్ ఎనర్జీ, ఎన్విరానె్మంట్ డిజైన్’ (ఎల్ఈఈడీ)లో మనదేశం ప్రపంచంలో మూడో ర్యాంకును సాధించింది. దాదాపు 24.81 మిలియన్ చదరపుమీటర్ల విస్తీర్ణంలో 899 ఎల్ఈఈడీ సర్టిఫైడ్ ప్రాజెక్టుల ద్వారా భారత్ ఈ ఘనతను సాధించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రాఫెల్ యుద్ధ విమానాల అంశంలో ఎన్డీఏ సర్కారుకు తలొగ్గిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుడు నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ధ్వజమెత్తారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన కాగ్ తలాతోకా లేని నివేదికను పార్లమెంటుకు సమర్పించిందని ఆరోపించారు. ఈ నివేదిక పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.