S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2018 - 01:54

న్యూఢిల్లీ, నవంబర్ 21: నోట్ల రద్దు నిర్ణయంతో రైతుల జీవితాలను నాశనం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు ఎన్నికల సభలలో వారి కష్టాలను అపహాస్యం చేస్తూ అవమాన పరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు.

11/22/2018 - 01:39

న్యూఢిల్లీ, నవంబర్ 21: గుండె వ్యాధితో, లోపాలతో బాధపడుతున్న 14 నెలల పాకిస్తానీ శిశువుకు ఇక్కడి సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన శస్తచ్రికిత్స విజయవంతమైంది. దీంతో ఆ శిశువు కోలుకున్నాడని వైద్యులు చెప్పారు. ఆ శిశువు శ్వాస కోశ సమస్యలతో కూడి సతమతమవుతోంది. దీని వల్ల శిశువుపెరుగుదల నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఆపరేషన్‌ను పిల్లల గుండెవ్యాధుల నిపుణులు నీజర్ అగర్వాల్ నిర్వహించారు.

11/22/2018 - 01:39

అహ్మదాబాద్, నవంబర్ 21: గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో మతర్ పట్టణంలో జరిగిన మత ఘర్షణల్లో నలుగురు గాయపడ్డారు. ఈద్ సందర్భంగా పతాకం ఎగరవేసే సందర్భంలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పరస్పరం దాడులు చేసుకుని కొన్ని దుకాణాలకు నిప్పుపెట్టినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. పట్టణంలో ముస్లింలు జెండా ఎగరవేయడాన్ని వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు అడ్డుకున్నారని వారు తెలిపారు.

11/22/2018 - 01:24

న్యూఢిల్లీ, నవంబర్ 21: ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో కాంగ్రెస్ మట్టికరుస్తుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వీడియో సందేశంలో పేర్కొన్నట్లుగా వైరల్ అవుతున్న దృశ్యాలు వివాదస్పదమవుతున్నాయి. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది.

11/22/2018 - 01:22

జైపూర్, నవంబర్ 21: రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్‌లోవున్న రైలుమార్గం రాజస్థాన్‌లోని టోంక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార, విపక్ష పార్టీలకు ఎన్నికల ప్రధానాస్త్రంగా మారింది. ఈ కీలక నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్‌పైలెట్, బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ తలపడుతున్నారు.

11/22/2018 - 01:16

రాజస్థాన్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బుసలు కొడుతోంది. వచ్చే నెల 7వ తేదీన రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసమ్మతిని చల్లార్చేందుకు బుజ్జగింపులు చేపట్టారు. కాని అసమ్మతి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.అసమ్మతి దెబ్బకు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

11/22/2018 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 21: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు.. ఒక కుటుంబానికి చెందిన పార్టీగా మారిన టీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా పోయాయని లోక్‌సభ సభ్యుడు కొండా విశే్వశ్వర రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

11/22/2018 - 00:05

శ్రీనగర్, నవంబర్ 21: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి బుధవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. సుస్థిరమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చిన తరుణంలో గవర్నర్ సుప్తచేతనావస్థలో ఉన్న శాసనసభను రద్దు చేయడం సంచలనం సృష్టించింది.

11/21/2018 - 17:20

న్యూఢిల్లీ:యూపీఏ హయాంలో ఆర్బీఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి పనిచేసేవారని, ఇపుడు అలాంటి పరిస్థితి లేదని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అంతర్జాతీయంగా జరిగే ఆర్థిక సమావేశాల్లో ఇరువురు కలిసి మాట్లాడేవారని, సన్నిహితంగా కలిసి పనిచేసేవారని అన్నారు. వారికి ఉన్న సొంత అభిప్రాయాలను గౌరవించుకుంటూ పనిచేసేవారని అన్నారు.

11/21/2018 - 17:19

ఇండోర్: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని నిర్మూలించవచ్చని మోదీ చేసిన ప్రయత్నం ఘోర వైఫల్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వల్ల ప్రజస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ వంటి సంస్థలు నిర్వీర్యం చెందుతున్నాయని అన్నారు. నోట్ల రద్దు వల్ల అవినీతి పెరిగిందే తప్పా తగ్గలేదని అన్నారు.

Pages