S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/11/2018 - 02:00

బెంగళూరు, నవంబర్ 10: మైసూరు రాజు టిప్పుసూల్తాన్ జయంతి ఉత్సవాలు ఉద్రిక్తతల నడుమ శనివారం కర్నాటక రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. 18వ శతాబ్ధానికి చెందిన టిప్పు సూల్తాన్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప హాజరు కాకపోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకల నిర్వహణకు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. బెంగళూరులో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు.

11/11/2018 - 01:58

ముంబయి, నవంబర్ 10: భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఏదోవిధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తాను కూడా బాలీవుడ్‌లో లైంగిక హింసకు బలయ్యానని మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్ తెలిపారు. మీటూ శీర్షిక కింద ఆమె తాను చవిచూసిన చేదు అనుభవాలను ట్వీట్ చేశారు. నిహారికా సింగ్ మిస్ లలీ సినిమాలో నటించారు. ఆమె చిత్రపరిశ్రమలో ఎదుర్కొన్న అనేక సంఘటనలను వివరించారు.

11/11/2018 - 01:50

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఢిల్లీ విమానాశ్రయంలో కందహార్‌కు వెళ్లే విమానంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల కలకలం చెలరేగింది. ఈ విమానం ఢిల్లీ నుంచి కందహార్‌కు బయలుదేరాలి. ఆ సమయంలో పైలెట్ పొరపాటున హైజాక్ బటన్‌ను నొక్కారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు గంటల సేపు విమానాన్ని నిలిపివేశారు. భద్రతాపరంగా మళ్లీ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

11/11/2018 - 01:49

న్యూఢిల్లీ, నవంబర్ 10: మిజోరం రాష్ట్ర ఎన్నికల అధికారి మార్పుపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. సీఈవో ఎస్‌బీ శశాంక్‌ను తప్పించాలంటూ ఐఏఎస్‌లు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఈసీ రంగంలోకి దిగింది. సీఈవో పదవికి సమర్ధుడైన అధికారి పేరును సూచించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరినట్టు ఈసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

11/11/2018 - 01:49

తిరువనంతపురం, నవంబర్ 10:శబరిమల ఆలయ దర్శనం కోసం 500 మంది మహిళలు ఈ-టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈనెల 17 నుంచి మండల-మకరవిల్లక్కు పూజల కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీంతో 10-50 ఏళ్ల మధ్యవయస్కులైన 500 మంది మహిళలు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అన్ని వయసుల మహిళలకూ శబరిమల ఆలయ దర్శనం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

11/11/2018 - 01:42

జగదల్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 10: అర్బన్ నక్సలైట్లతో తమకు సంబంధం ఉందని బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, దేశ భక్తి గురించి తమ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ త్యాగమూర్తుల నిలయమన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లలో బీజేపీ అవినీతికి పాల్పడిందని, దీనిపై నోరుమెదపకుండా ప్రధాని మోదీ తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

11/11/2018 - 01:44

రాయ్‌పూర్, నవంబర్ 10: రమణ్‌సింగ్ నాయకత్వంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం నాలుగుచెరుగుల అభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. ఒక విధంగా సమస్యల రహిత రాష్ట్రంగా ఆవిర్భవించిందని శనివారం ఇక్కడ అన్నారు. నక్సలిజం సైతం బాగా తగ్గుముఖం పట్టిందని షా చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో ఎలాంటి మంచీ జరగదని ఆయన తేల్చిచెప్పారు.

11/11/2018 - 00:39

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన మరోసారి వాయిదా పడింది. అభ్యర్థుల జాబితాను 12 లేదా 13న ప్రకటిస్తాం.. వెనుకబడిన కులాల వారికి 25 సీట్లు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ తెలిపారు.

11/10/2018 - 16:27

శ్రీనగర్: పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ రోజు కాల్పుల ఒప్పందాన్ని విస్మరించి సైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్ మృతిచెందారు. కాగా మన సైనికులు పాక్ కాల్పులను తిప్పికొట్టారు.

11/10/2018 - 16:22

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, 50శాతం విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసింది. కుంటుంబంలో నిరుద్యోగి ఉంటే రూ.10000 ఇస్తామని, ఆడపిల్ల పెళ్లికి రూ.51 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.

Pages