-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
అమృత్సర్లో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆదివారం గస్తీ నిర్వహిస్తున్న రాఫ్ దళాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఈశాన్య భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న 25 లోక్సభ స్థానాల్లో 20 స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకోవడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతోబాటు మిత్రపక్షాల నుంచి గెలుపొందిన 11 మంది లోక్సభ సభ్యులున్నారు. ఇందులో ఏడుగురు అస్సాం రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.
రాయ్పూర్, అక్టోబర్ 21: చత్తీస్గఢ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీ తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరిగి విజయం సాధిస్తారని నమ్ముతోంది. అంతేకాకుండా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన 14 మందికి తిరిగి ఆ పార్టీ అధిష్టానం టికెట్లు ఇచ్చి రంగంలోకి దింపింది. 90 సీట్లకుగాను 77 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను తొలజాబితాలో ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిపై 2014-2017 మధ్య వచ్చిన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు, దానికి సంబంధించి తీసుకున్న చర్యల గురించి వెంటనే వెల్లడించాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ)ను కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో నిరుద్యోగ సమస్య యువతను ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ పారామిలటరీ దళాల్లో 61వేల పోస్టులు ఖాళీగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు పారామిలిటరీ దళాల్లో 61వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కొచ్చి, అక్టోబర్ 21: శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను వెలివేస్తున్నట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు. లక్షలాది హిందువుల మనోభావాలను కించపరిచేలా ఆమె ప్రవర్తించారు.. అందుకు ఆమెను వెలివేస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ తెలిపింది. ఆమెపై తక్షణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ అధ్యక్షుడు ఏ పూన్కుంజు ఒక ప్రకటనలో వెల్లడించారు.
పంబ, అక్టోబర్ 21: పవిత్ర శబరిమల పర్వతాలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను ఆదివారం భక్తులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సుమారు నలభై యేళ్ల వయసున్న ఈ ఇద్దరు మహిళలు తమ బంధువులతోబాటు కొండ ఎక్కేందుకు రాగా ‘స్వామియే శరణమయ్యప్పా’ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు నీలిమల వద్ద వారిని అడ్డగించారు. ఈ ఆలయ ఆచారాలు తెలియకుండా ఆ మహిళలు ఇక్కడికి వచ్చారని తెలుస్తోంది.
శ్రీనగర్, అక్టోబర్ 21: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, అనంతరం జరిగిన పేలుడులో ఆరుగురు పౌరులు దుర్మరణం చెందారు. జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతాదళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టిన భద్రతాదళాలపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయ.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: స్వాతంత్య్రం కోసం పోరాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజ్యాంగ నిర్మాత భీంరావు అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే రెండింతల బలంతో దెబ్బతీస్తామని హెచ్చరించారు.
అమృత్సర్, అక్టోబర్ 20: దసరా పండుగనాడు జరిగిన అమృత్సర్ రైలు ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది బిహార్, యూపీకి చెందినవారే. నిరుపేద వలస కూలీలేనని అధికారులు శనివారం వెల్లడించారు. ఘోర ప్రమాదంలో 61 మంది చనిపోగా 39 మృత దేహాలను గుర్తించారు. మృతుల్లో అత్యధికులు యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.