S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/20/2018 - 06:12

తిరువనంతపురం, అక్టోబర్ 19: శబరిమల ఆలయ ప్రవేశం చేయాలనుకున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప భక్తుల సెంటిమెంట్‌కు తలగ్గొక తప్పలేదు. కొండపైకి చేరుకున్నప్పటికీ వేలాది మంది భక్తులు వలయంలా ఏర్పడి వార్ని ముందుకు కదలనీయలేదు. శబరిమల కొండపై శనివారం ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కవిత అనే జర్నలిస్టు, ఏర్నాకుళానికి చెందిన రేహ్మా ఫాతిమాలు పోలీసుల సహకారంతో కొండపైకి చేరుకున్నారు.

10/20/2018 - 06:56

న్యూఢిల్లీ: తెలంగాణలో సీట్ల సర్దుబాటు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం కావటం తెలిసిందే.

10/20/2018 - 02:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కడప ఉక్కు పరిశ్రమ స్థాపనపై ఏర్పాటైన టాస్క్ఫోర్సుకు నివేదికను త్వరగా సమర్పించాలని మెకాన్ సంస్థను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ఆదేశించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన టాస్క్ఫోర్సుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వాశాఖ గురువారం సమీక్ష నిర్వహించారు.

10/20/2018 - 05:18

* 72మందికి తీవ్ర గాయాలు *పెను విషాదమైన దసరా ఆనందం
* ప్రధాని, రాష్టప్రతి సంతాపం * బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

10/20/2018 - 05:24

న్యూఢిల్లీ, అక్టోబరు 19: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఏ మూలకు పంపినా చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తానని స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు.

10/20/2018 - 05:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ (93) గురువారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన తివారీ మధ్యాహ్నం 2.50కి మృతి చెందారు. తివారీ పుట్టిన రోజు అక్టోబర్ 18. అదే రోజు ఆయన కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుల్లో ఆయనొకరు.

10/18/2018 - 05:35

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనేక మంది మహిళా జర్నలిస్టులు గతంలో అక్బర్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో ఆయన వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన ఫలితంగా బుధవారం మంత్రి పదవినుంచి తప్పుకున్నారు.

10/18/2018 - 05:27

జైపూర్, అక్టోబర్ 17: రాజస్థాన్‌లో డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎసీ) రెండువందల స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీవర్గాలు బుథవారం నాడిక్కడ తెలిపాయి. పార్టీ చీఫ్ మాయావతి రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 10న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

10/18/2018 - 05:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ‘రాజీ, పద్మావత్, పింక్ వంటి చిత్రాలతో ఇటీవల కాలంలో బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. గొప్ప గొప్ప స్టార్స్ లేకుండానే ఇటీవల విడుదలవుతోన్న కొన్ని చిత్రాలు నిర్మాతలకు కాసుల పంటను పండిస్తున్నాయ కారణం.. ఆ సినిమాలు మహిళా ప్రాధాన్యతతో కూడుకున్నవి కావడమే’ అంటోంది బాలీవుడ్ నటి కాజోల్. ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరచాలి.

10/18/2018 - 05:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారతీయ రైల్వేల చరిత్రలో మరో అరుదైన ఘటన ఆవిష్కృతం కానుంది. దేశంలోనే తొలిసారి టనె్నల్ లోపల రైల్వే స్టేషన్ రానుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో సొరంగంలో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించతలపెట్టారు. సొరంగం లోపల 3000 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. బిలాస్‌పూర్- మనాలీ లెహ్ లైన్‌లో ఏర్పాటుచేసిన ఈ కొత్త స్టేషన్ చైనా-ఇండియా సరిహద్దుకు దగ్గర్లో ఉంది.

Pages